Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ధాన్యం కోసం పోరాడితే అరెస్టులా..? రైతు నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ పూల శివప్రసాద్ ఆధ్వర్యంలో పాలకవర్గ సర్వసభ్య సమావేశం సత్యసాయి తాగునీటి కార్మికులకు వైసీపీ మద్దతు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ லஞ்ச் பாக்ஸுடன் செயலகத்திற்கு முதல்வர் விஜய்.. சாதாரண ஊழியரைப் போல புதிய பணிமுறை వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 16, 2026 10:29 PM

కొండపై వర్తక సంఘం రద్దు చేయాలి. మంత్రులకు యాదగిరిగుట్ట పరిరక్షణ కమిటీ వినతి

కొండపై వర్తక సంఘం రద్దు చేయాలి. మంత్రులకు యాదగిరిగుట్ట పరిరక్షణ కమిటీ వినతి

కొండపై వర్తక సంఘం రద్దు చేయాలి. మంత్రులకు యాదగిరిగుట్ట పరిరక్షణ కమిటీ వినతి
May 16, 2026 08:36 PM 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కొండపై కొనసాగుతున్న వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్లు నిర్వహించాలని యాదగిరిగుట్ట పరిరక్షణ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతిపత్రం అందజేశారు.

కొండపై ఉన్న 10 దుకాణాలకు వర్తక సంఘం ద్వారా దేవస్థానానికి ఏటా కేవలం రూ.1.68 కోట్లు మాత్రమే అందుతున్నాయని పేర్కొన్నారు. అదే టెండర్ల ద్వారా నిర్వహిస్తే దేవస్థానానికి కోట్ల రూపాయల ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నారు. ఒక సెల్‌ఫోన్ కౌంటర్‌కే ఏటా రూ.2.22 కోట్లకుపైగా ఆదాయం వచ్చే అవకాశముందని తెలిపారు.

ప్రతి ఏడాది టెండర్లు నిర్వహించడం ద్వారా కొత్త వారికి ఉపాధి, వ్యాపార అవకాశాలు లభిస్తాయని, దేవస్థాన ఆదాయం పెరిగి భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించవచ్చన్నారు. ప్రస్తుతం ఉన్న 10 దుకాణాలను రద్దు చేసి అదనంగా 30 కొత్త దుకాణాలకు టెండర్లు పిలవాలని స్థానికులు, వ్యాపారులు, నిరుద్యోగులు కోరుతున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో కాటబత్తిని ఆంజనేయులు, ఆరెస్వామి, బండ రామస్వామి, దండబోయిన వీరేష్, బండి వాసు, కర్రే ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News