Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:58 AM

కొండపై వర్తక సంఘం రద్దు చేయాలి. మంత్రులకు యాదగిరిగుట్ట పరిరక్షణ కమిటీ వినతి

కొండపై వర్తక సంఘం రద్దు చేయాలి. మంత్రులకు యాదగిరిగుట్ట పరిరక్షణ కమిటీ వినతి

కొండపై వర్తక సంఘం రద్దు చేయాలి. మంత్రులకు యాదగిరిగుట్ట పరిరక్షణ కమిటీ వినతి
16-05-2026 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కొండపై కొనసాగుతున్న వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్లు నిర్వహించాలని యాదగిరిగుట్ట పరిరక్షణ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతిపత్రం అందజేశారు.

కొండపై ఉన్న 10 దుకాణాలకు వర్తక సంఘం ద్వారా దేవస్థానానికి ఏటా కేవలం రూ.1.68 కోట్లు మాత్రమే అందుతున్నాయని పేర్కొన్నారు. అదే టెండర్ల ద్వారా నిర్వహిస్తే దేవస్థానానికి కోట్ల రూపాయల ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నారు. ఒక సెల్‌ఫోన్ కౌంటర్‌కే ఏటా రూ.2.22 కోట్లకుపైగా ఆదాయం వచ్చే అవకాశముందని తెలిపారు.

ప్రతి ఏడాది టెండర్లు నిర్వహించడం ద్వారా కొత్త వారికి ఉపాధి, వ్యాపార అవకాశాలు లభిస్తాయని, దేవస్థాన ఆదాయం పెరిగి భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించవచ్చన్నారు. ప్రస్తుతం ఉన్న 10 దుకాణాలను రద్దు చేసి అదనంగా 30 కొత్త దుకాణాలకు టెండర్లు పిలవాలని స్థానికులు, వ్యాపారులు, నిరుద్యోగులు కోరుతున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో కాటబత్తిని ఆంజనేయులు, ఆరెస్వామి, బండ రామస్వామి, దండబోయిన వీరేష్, బండి వాసు, కర్రే ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కొండపై వర్తక సంఘం రద్దు చేయాలి. మంత్రులకు యాదగిరిగుట్ట పరిరక్షణ కమిటీ వినతి

Article Image

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కొండపై కొనసాగుతున్న వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్లు నిర్వహించాలని యాదగిరిగుట్ట పరిరక్షణ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతిపత్రం అందజేశారు.

కొండపై ఉన్న 10 దుకాణాలకు వర్తక సంఘం ద్వారా దేవస్థానానికి ఏటా కేవలం రూ.1.68 కోట్లు మాత్రమే అందుతున్నాయని పేర్కొన్నారు. అదే టెండర్ల ద్వారా నిర్వహిస్తే దేవస్థానానికి కోట్ల రూపాయల ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నారు. ఒక సెల్‌ఫోన్ కౌంటర్‌కే ఏటా రూ.2.22 కోట్లకుపైగా ఆదాయం వచ్చే అవకాశముందని తెలిపారు.

ప్రతి ఏడాది టెండర్లు నిర్వహించడం ద్వారా కొత్త వారికి ఉపాధి, వ్యాపార అవకాశాలు లభిస్తాయని, దేవస్థాన ఆదాయం పెరిగి భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించవచ్చన్నారు. ప్రస్తుతం ఉన్న 10 దుకాణాలను రద్దు చేసి అదనంగా 30 కొత్త దుకాణాలకు టెండర్లు పిలవాలని స్థానికులు, వ్యాపారులు, నిరుద్యోగులు కోరుతున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో కాటబత్తిని ఆంజనేయులు, ఆరెస్వామి, బండ రామస్వామి, దండబోయిన వీరేష్, బండి వాసు, కర్రే ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News