కొండపై వర్తక సంఘం రద్దు చేయాలి. మంత్రులకు యాదగిరిగుట్ట పరిరక్షణ కమిటీ వినతి
కొండపై వర్తక సంఘం రద్దు చేయాలి. మంత్రులకు యాదగిరిగుట్ట పరిరక్షణ కమిటీ వినతి
Editor Desk
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కొండపై కొనసాగుతున్న వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్లు నిర్వహించాలని యాదగిరిగుట్ట పరిరక్షణ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతిపత్రం అందజేశారు.
కొండపై ఉన్న 10 దుకాణాలకు వర్తక సంఘం ద్వారా దేవస్థానానికి ఏటా కేవలం రూ.1.68 కోట్లు మాత్రమే అందుతున్నాయని పేర్కొన్నారు. అదే టెండర్ల ద్వారా నిర్వహిస్తే దేవస్థానానికి కోట్ల రూపాయల ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నారు. ఒక సెల్ఫోన్ కౌంటర్కే ఏటా రూ.2.22 కోట్లకుపైగా ఆదాయం వచ్చే అవకాశముందని తెలిపారు.
ప్రతి ఏడాది టెండర్లు నిర్వహించడం ద్వారా కొత్త వారికి ఉపాధి, వ్యాపార అవకాశాలు లభిస్తాయని, దేవస్థాన ఆదాయం పెరిగి భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించవచ్చన్నారు. ప్రస్తుతం ఉన్న 10 దుకాణాలను రద్దు చేసి అదనంగా 30 కొత్త దుకాణాలకు టెండర్లు పిలవాలని స్థానికులు, వ్యాపారులు, నిరుద్యోగులు కోరుతున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో కాటబత్తిని ఆంజనేయులు, ఆరెస్వామి, బండ రామస్వామి, దండబోయిన వీరేష్, బండి వాసు, కర్రే ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి