Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:56 AM

ధాన్యం కోసం పోరాడితే అరెస్టులా..? రైతు నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ధాన్యం కోసం పోరాడితే అరెస్టులా..? రైతు నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ధాన్యం కోసం పోరాడితే అరెస్టులా..?    రైతు నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
16-05-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మార్కెట్లలో రెండు నెలలుగా నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ భువనగిరి కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న ధర్నాకు వెళ్తున్న రైతు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.

రైతు సంఘాల పిలుపుమేరకు పెద్దతుమ్మలగూడెం రైతుల ఆధ్వర్యంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్, బీసీ యువజన సంఘం ఉమ్మడి నల్గొండ జిల్లా కన్వీనర్ ఎడ్ల మహాలింగం భువనగిరికి బయలుదేరగా రామన్నపేట వద్ద పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం సాయంత్రం విడుదల చేశారు.

అరెస్టులతో ఉద్యమాలు ఆగవు

ఈ సందర్భంగా మోదీరాందేవ్ మాట్లాడుతూ రైతులు ధాన్యం కొనుగోలు కోసం పోరాడుతుంటే అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు. ఫోన్ లొకేషన్ ట్రాక్ చేసి అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు.

రైతులు మాట్లాడుతూ మార్కెట్లలో ధాన్యం నెలల తరబడి నిల్వ ఉండటంతో వర్షాలకు తడిసి నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేసి లారీలు, గిడ్డంగులు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.

క్వింటాకు ఐదు నుంచి ఆరు కిలోల వరకు కోతలు వేస్తున్న రైస్ మిల్లులపై చర్యలు తీసుకోవాలని, కాంటా వేసిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని కోరారు. రైతు ప్రభుత్వం అంటూ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.

Sthanikam

ధాన్యం కోసం పోరాడితే అరెస్టులా..? రైతు నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Article Image

రామన్నపేట: మార్కెట్లలో రెండు నెలలుగా నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ భువనగిరి కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న ధర్నాకు వెళ్తున్న రైతు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.

రైతు సంఘాల పిలుపుమేరకు పెద్దతుమ్మలగూడెం రైతుల ఆధ్వర్యంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్, బీసీ యువజన సంఘం ఉమ్మడి నల్గొండ జిల్లా కన్వీనర్ ఎడ్ల మహాలింగం భువనగిరికి బయలుదేరగా రామన్నపేట వద్ద పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం సాయంత్రం విడుదల చేశారు.

అరెస్టులతో ఉద్యమాలు ఆగవు

ఈ సందర్భంగా మోదీరాందేవ్ మాట్లాడుతూ రైతులు ధాన్యం కొనుగోలు కోసం పోరాడుతుంటే అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు. ఫోన్ లొకేషన్ ట్రాక్ చేసి అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు.

రైతులు మాట్లాడుతూ మార్కెట్లలో ధాన్యం నెలల తరబడి నిల్వ ఉండటంతో వర్షాలకు తడిసి నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేసి లారీలు, గిడ్డంగులు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.

క్వింటాకు ఐదు నుంచి ఆరు కిలోల వరకు కోతలు వేస్తున్న రైస్ మిల్లులపై చర్యలు తీసుకోవాలని, కాంటా వేసిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని కోరారు. రైతు ప్రభుత్వం అంటూ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News