చిరుమర్తి లింగయ్యపై విమర్శలు తగవు కంపసాటి శ్రీనివాస్పై బీఆర్ఎస్ నేతల ధ్వజం
చిరుమర్తి లింగయ్యపై విమర్శలు తగవు కంపసాటి శ్రీనివాస్పై బీఆర్ఎస్ నేతల ధ్వజం
Editor Desk
కేతేపల్లి: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కంపసాటి శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నాయకులు ఖండించారు. కేతేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మారం వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. తన సొంత గ్రామంలో వార్డు సభ్యుడిగా కూడా గెలవలేని వ్యక్తి సీనియర్ నాయకుడిపై విమర్శలు చేయడం సరికాదన్నారు.
అధికార పార్టీ పేరు చెప్పుకుంటూ గ్రామాల్లో పంచాయితీలు, కుటుంబ వివాదాల్లో మధ్యవర్తిత్వం చేస్తూ అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆరోపించారు. మరోసారి చిరుమర్తి లింగయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించారు.
చీకటిగూడెం ఘటనపై అవాస్తవాలు ప్రచారం
చీకటిగూడెం గ్రామ ఘర్షణ విషయంలో కంపసాటి శ్రీనివాస్ యాదవ్ అసత్య ప్రచారం చేస్తున్నారని బాధితుడు ఆల్దాస్ సతీష్ భార్య మంజుల ఆరోపించారు. ఐకేపీ సెంటర్లో జరిగిన వివాదాన్ని రాజకీయ కక్షతో మలిచారని తెలిపారు.
తమ కుటుంబానికి ఎటువంటి భూములు లేవని, వరి పంట కూడా వేయలేదని చెప్పారు. గతంలో కూడా అక్రమ కేసులు పెట్టించి తమ వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు.
ఘర్షణ కేసులో పరారీలో ఉన్న ఉప్పుల శివ, మైనం మహేష్లను వెంటనే అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
విలేకరుల సమావేశంలో కొప్పుల ప్రదీప్రెడ్డి, బంటు మహేందర్, కొండ సైదులు, కొండేటి రెడ్డి, నల్లపు నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి