Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లైబ్రరీలు విజ్ఞాన భాండాగారాలు. పుస్తక పఠనంతో చరిత్రపై అవగాహన పెరుగుతుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ పూల శివప్రసాద్ ఆధ్వర్యంలో పాలకవర్గ సర్వసభ్య సమావేశం సత్యసాయి తాగునీటి కార్మికులకు వైసీపీ మద్దతు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ லஞ்ச் பாக்ஸுடன் செயலகத்திற்கு முதல்வர் விஜய்.. சாதாரண ஊழியரைப் போல புதிய பணிமுறை వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 16, 2026 07:30 PM

చిరుమర్తి లింగయ్యపై విమర్శలు తగవు కంపసాటి శ్రీనివాస్‌పై బీఆర్‌ఎస్ నేతల ధ్వజం

చిరుమర్తి లింగయ్యపై విమర్శలు తగవు కంపసాటి శ్రీనివాస్‌పై బీఆర్‌ఎస్ నేతల ధ్వజం

చిరుమర్తి లింగయ్యపై విమర్శలు తగవు కంపసాటి శ్రీనివాస్‌పై బీఆర్‌ఎస్ నేతల ధ్వజం
May 16, 2026 05:38 PM 16 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కేతేపల్లి: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కంపసాటి శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ నాయకులు ఖండించారు. కేతేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మారం వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. తన సొంత గ్రామంలో వార్డు సభ్యుడిగా కూడా గెలవలేని వ్యక్తి సీనియర్ నాయకుడిపై విమర్శలు చేయడం సరికాదన్నారు.

అధికార పార్టీ పేరు చెప్పుకుంటూ గ్రామాల్లో పంచాయితీలు, కుటుంబ వివాదాల్లో మధ్యవర్తిత్వం చేస్తూ అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆరోపించారు. మరోసారి చిరుమర్తి లింగయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించారు.

చీకటిగూడెం ఘటనపై అవాస్తవాలు ప్రచారం

చీకటిగూడెం గ్రామ ఘర్షణ విషయంలో కంపసాటి శ్రీనివాస్ యాదవ్ అసత్య ప్రచారం చేస్తున్నారని బాధితుడు ఆల్దాస్ సతీష్ భార్య మంజుల ఆరోపించారు. ఐకేపీ సెంటర్‌లో జరిగిన వివాదాన్ని రాజకీయ కక్షతో మలిచారని తెలిపారు.

తమ కుటుంబానికి ఎటువంటి భూములు లేవని, వరి పంట కూడా వేయలేదని చెప్పారు. గతంలో కూడా అక్రమ కేసులు పెట్టించి తమ వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు.

ఘర్షణ కేసులో పరారీలో ఉన్న ఉప్పుల శివ, మైనం మహేష్‌లను వెంటనే అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

విలేకరుల సమావేశంలో కొప్పుల ప్రదీప్‌రెడ్డి, బంటు మహేందర్, కొండ సైదులు, కొండేటి రెడ్డి, నల్లపు నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News