Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:11 AM

చిరుమర్తి లింగయ్యపై విమర్శలు తగవు కంపసాటి శ్రీనివాస్‌పై బీఆర్‌ఎస్ నేతల ధ్వజం

చిరుమర్తి లింగయ్యపై విమర్శలు తగవు కంపసాటి శ్రీనివాస్‌పై బీఆర్‌ఎస్ నేతల ధ్వజం

చిరుమర్తి లింగయ్యపై విమర్శలు తగవు కంపసాటి శ్రీనివాస్‌పై బీఆర్‌ఎస్ నేతల ధ్వజం
16-05-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కేతేపల్లి: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కంపసాటి శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ నాయకులు ఖండించారు. కేతేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మారం వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. తన సొంత గ్రామంలో వార్డు సభ్యుడిగా కూడా గెలవలేని వ్యక్తి సీనియర్ నాయకుడిపై విమర్శలు చేయడం సరికాదన్నారు.

అధికార పార్టీ పేరు చెప్పుకుంటూ గ్రామాల్లో పంచాయితీలు, కుటుంబ వివాదాల్లో మధ్యవర్తిత్వం చేస్తూ అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆరోపించారు. మరోసారి చిరుమర్తి లింగయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించారు.

చీకటిగూడెం ఘటనపై అవాస్తవాలు ప్రచారం

చీకటిగూడెం గ్రామ ఘర్షణ విషయంలో కంపసాటి శ్రీనివాస్ యాదవ్ అసత్య ప్రచారం చేస్తున్నారని బాధితుడు ఆల్దాస్ సతీష్ భార్య మంజుల ఆరోపించారు. ఐకేపీ సెంటర్‌లో జరిగిన వివాదాన్ని రాజకీయ కక్షతో మలిచారని తెలిపారు.

తమ కుటుంబానికి ఎటువంటి భూములు లేవని, వరి పంట కూడా వేయలేదని చెప్పారు. గతంలో కూడా అక్రమ కేసులు పెట్టించి తమ వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు.

ఘర్షణ కేసులో పరారీలో ఉన్న ఉప్పుల శివ, మైనం మహేష్‌లను వెంటనే అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

విలేకరుల సమావేశంలో కొప్పుల ప్రదీప్‌రెడ్డి, బంటు మహేందర్, కొండ సైదులు, కొండేటి రెడ్డి, నల్లపు నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చిరుమర్తి లింగయ్యపై విమర్శలు తగవు కంపసాటి శ్రీనివాస్‌పై బీఆర్‌ఎస్ నేతల ధ్వజం

Article Image

కేతేపల్లి: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కంపసాటి శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ నాయకులు ఖండించారు. కేతేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మారం వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. తన సొంత గ్రామంలో వార్డు సభ్యుడిగా కూడా గెలవలేని వ్యక్తి సీనియర్ నాయకుడిపై విమర్శలు చేయడం సరికాదన్నారు.

అధికార పార్టీ పేరు చెప్పుకుంటూ గ్రామాల్లో పంచాయితీలు, కుటుంబ వివాదాల్లో మధ్యవర్తిత్వం చేస్తూ అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆరోపించారు. మరోసారి చిరుమర్తి లింగయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించారు.

చీకటిగూడెం ఘటనపై అవాస్తవాలు ప్రచారం

చీకటిగూడెం గ్రామ ఘర్షణ విషయంలో కంపసాటి శ్రీనివాస్ యాదవ్ అసత్య ప్రచారం చేస్తున్నారని బాధితుడు ఆల్దాస్ సతీష్ భార్య మంజుల ఆరోపించారు. ఐకేపీ సెంటర్‌లో జరిగిన వివాదాన్ని రాజకీయ కక్షతో మలిచారని తెలిపారు.

తమ కుటుంబానికి ఎటువంటి భూములు లేవని, వరి పంట కూడా వేయలేదని చెప్పారు. గతంలో కూడా అక్రమ కేసులు పెట్టించి తమ వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు.

ఘర్షణ కేసులో పరారీలో ఉన్న ఉప్పుల శివ, మైనం మహేష్‌లను వెంటనే అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

విలేకరుల సమావేశంలో కొప్పుల ప్రదీప్‌రెడ్డి, బంటు మహేందర్, కొండ సైదులు, కొండేటి రెడ్డి, నల్లపు నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News