ఉద్యమకారుల గుర్తింపు కమిటీకి స్వాగతం. ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం: ఉద్యమకారుల ఫోరం
ఉద్యమకారుల గుర్తింపు కమిటీకి స్వాగతం. ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం: ఉద్యమకారుల ఫోరం
Editor Desk
రామన్నపేట, మే 16: తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఏర్పాటు చేయడాన్ని రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం నాయకులు స్వాగతించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో హామీల అమలులో భాగంగా కమిటీని ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.
కె. కేశవరావును కమిటీ చైర్మన్గా, పొన్నం ప్రభాకర్, ప్రొఫెసర్ కొదండరాం, అద్దంకి దయాకర్, ఎస్. రాములు నాయక్, మోతే శోభన్రెడ్డిని సభ్యులుగా నియమించడం ద్వారా ఉద్యమకారుల గుర్తింపుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు చీమ శ్రీనివాస్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్కే చాంద్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్కు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో రామన్నపేట మండల అధ్యక్షుడు నోముల శంకర్, ఉపాధ్యక్షుడు బొడ్డుపల్లి లింగయ్య, రాష్ట్ర నాయకుడు రెబ్బాసు రాములు, ఉద్యమ నాయకులు గంగాపురం, గొలుసుల ప్రసాద్, యాదాసు లక్ష్మణ్, కైరం కొండ సంతోష్, పెండం రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి