Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:53 AM

భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి దేవస్థాన ఈవోకు రైతుల వినతి

భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి దేవస్థాన ఈవోకు రైతుల వినతి

భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి దేవస్థాన ఈవోకు రైతుల వినతి
16-05-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పునరుద్ధరణ కోసం భూములు ఇచ్చిన రైతులు, భూ నిర్వాసితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ శనివారం దేవస్థానం ఈవోకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండ వెనుక భాగంలో ఉన్న తమ భూములను దేవస్థాన అభివృద్ధి కోసం అప్పగిస్తే దుకాణాలు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కోట్ల రూపాయల విలువైన భూములను ప్రభుత్వ ఆదేశాలను గౌరవిస్తూ ఇచ్చినా, పరిహారం రూపంలో డబ్బులు మాత్రమే అందించారని, హామీలు మాత్రం అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

భూములు కోల్పోవడంతో వ్యవసాయం లేకుండా పోయిందని, ఉపాధి అవకాశాలు లేక కుటుంబాలతో కలిసి ఇతర ప్రాంతాలకు వెళ్లి కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నామని తెలిపారు. తమ భూములపై దేవస్థానం వ్రత మండపాలు, వాహన పూజా కేంద్రాలు, అన్నదాన భవనం, హెలిప్యాడ్, పార్కింగ్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేసి భక్తులకు ఉపయోగపడుతున్నాయని, కానీ భూములు ఇచ్చిన తామే ఇబ్బందులు పడుతున్నామని అన్నారు.

రోడ్డు విస్తరణలో ఇండ్లు, దుకాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం నివాస స్థలాలు, దుకాణాలు ఇచ్చినట్లే, తమకూ కొండపై లేదా కొండ వెనుక భాగంలో దుకాణాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు.

కార్యక్రమంలో బి. నాగరాజు, నర్సింహ, రాములు, ఆర్‌. మత్స్యగిరి పాల్గొన్నారు.

Sthanikam

భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి దేవస్థాన ఈవోకు రైతుల వినతి

Article Image

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పునరుద్ధరణ కోసం భూములు ఇచ్చిన రైతులు, భూ నిర్వాసితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ శనివారం దేవస్థానం ఈవోకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండ వెనుక భాగంలో ఉన్న తమ భూములను దేవస్థాన అభివృద్ధి కోసం అప్పగిస్తే దుకాణాలు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కోట్ల రూపాయల విలువైన భూములను ప్రభుత్వ ఆదేశాలను గౌరవిస్తూ ఇచ్చినా, పరిహారం రూపంలో డబ్బులు మాత్రమే అందించారని, హామీలు మాత్రం అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

భూములు కోల్పోవడంతో వ్యవసాయం లేకుండా పోయిందని, ఉపాధి అవకాశాలు లేక కుటుంబాలతో కలిసి ఇతర ప్రాంతాలకు వెళ్లి కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నామని తెలిపారు. తమ భూములపై దేవస్థానం వ్రత మండపాలు, వాహన పూజా కేంద్రాలు, అన్నదాన భవనం, హెలిప్యాడ్, పార్కింగ్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేసి భక్తులకు ఉపయోగపడుతున్నాయని, కానీ భూములు ఇచ్చిన తామే ఇబ్బందులు పడుతున్నామని అన్నారు.

రోడ్డు విస్తరణలో ఇండ్లు, దుకాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం నివాస స్థలాలు, దుకాణాలు ఇచ్చినట్లే, తమకూ కొండపై లేదా కొండ వెనుక భాగంలో దుకాణాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు.

కార్యక్రమంలో బి. నాగరాజు, నర్సింహ, రాములు, ఆర్‌. మత్స్యగిరి పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News