భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి దేవస్థాన ఈవోకు రైతుల వినతి
భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి దేవస్థాన ఈవోకు రైతుల వినతి
Editor Desk
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పునరుద్ధరణ కోసం భూములు ఇచ్చిన రైతులు, భూ నిర్వాసితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ శనివారం దేవస్థానం ఈవోకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండ వెనుక భాగంలో ఉన్న తమ భూములను దేవస్థాన అభివృద్ధి కోసం అప్పగిస్తే దుకాణాలు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కోట్ల రూపాయల విలువైన భూములను ప్రభుత్వ ఆదేశాలను గౌరవిస్తూ ఇచ్చినా, పరిహారం రూపంలో డబ్బులు మాత్రమే అందించారని, హామీలు మాత్రం అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
భూములు కోల్పోవడంతో వ్యవసాయం లేకుండా పోయిందని, ఉపాధి అవకాశాలు లేక కుటుంబాలతో కలిసి ఇతర ప్రాంతాలకు వెళ్లి కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నామని తెలిపారు. తమ భూములపై దేవస్థానం వ్రత మండపాలు, వాహన పూజా కేంద్రాలు, అన్నదాన భవనం, హెలిప్యాడ్, పార్కింగ్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేసి భక్తులకు ఉపయోగపడుతున్నాయని, కానీ భూములు ఇచ్చిన తామే ఇబ్బందులు పడుతున్నామని అన్నారు.
రోడ్డు విస్తరణలో ఇండ్లు, దుకాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం నివాస స్థలాలు, దుకాణాలు ఇచ్చినట్లే, తమకూ కొండపై లేదా కొండ వెనుక భాగంలో దుకాణాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు.
కార్యక్రమంలో బి. నాగరాజు, నర్సింహ, రాములు, ఆర్. మత్స్యగిరి పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి