Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ధాన్యం కోసం పోరాడితే అరెస్టులా..? రైతు నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ పూల శివప్రసాద్ ఆధ్వర్యంలో పాలకవర్గ సర్వసభ్య సమావేశం సత్యసాయి తాగునీటి కార్మికులకు వైసీపీ మద్దతు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ லஞ்ச் பாக்ஸுடன் செயலகத்திற்கு முதல்வர் விஜய்.. சாதாரண ஊழியரைப் போல புதிய பணிமுறை వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 16, 2026 10:32 PM

భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి దేవస్థాన ఈవోకు రైతుల వినతి

భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి దేవస్థాన ఈవోకు రైతుల వినతి

భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి దేవస్థాన ఈవోకు రైతుల వినతి
May 16, 2026 08:39 PM 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పునరుద్ధరణ కోసం భూములు ఇచ్చిన రైతులు, భూ నిర్వాసితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ శనివారం దేవస్థానం ఈవోకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండ వెనుక భాగంలో ఉన్న తమ భూములను దేవస్థాన అభివృద్ధి కోసం అప్పగిస్తే దుకాణాలు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కోట్ల రూపాయల విలువైన భూములను ప్రభుత్వ ఆదేశాలను గౌరవిస్తూ ఇచ్చినా, పరిహారం రూపంలో డబ్బులు మాత్రమే అందించారని, హామీలు మాత్రం అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

భూములు కోల్పోవడంతో వ్యవసాయం లేకుండా పోయిందని, ఉపాధి అవకాశాలు లేక కుటుంబాలతో కలిసి ఇతర ప్రాంతాలకు వెళ్లి కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నామని తెలిపారు. తమ భూములపై దేవస్థానం వ్రత మండపాలు, వాహన పూజా కేంద్రాలు, అన్నదాన భవనం, హెలిప్యాడ్, పార్కింగ్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేసి భక్తులకు ఉపయోగపడుతున్నాయని, కానీ భూములు ఇచ్చిన తామే ఇబ్బందులు పడుతున్నామని అన్నారు.

రోడ్డు విస్తరణలో ఇండ్లు, దుకాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం నివాస స్థలాలు, దుకాణాలు ఇచ్చినట్లే, తమకూ కొండపై లేదా కొండ వెనుక భాగంలో దుకాణాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు.

కార్యక్రమంలో బి. నాగరాజు, నర్సింహ, రాములు, ఆర్‌. మత్స్యగిరి పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News