హయత్నగర్: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్నగర్లో “మొబైల్ ఫోన్లలో ఏఐ టూల్స్ ఉపయోగించి కార్యకలాపాల నివేదిక తయారీ” అంశంపై ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ఐక్యూఏసీ, రసాయన శాస్త్ర విభాగం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. సురేష్బాబు అధ్యక్షత వహించారు.
వనరు వ్యక్తిగా పాల్గొన్న డా. డి. బాల నరసింహ మొబైల్ ఆధారిత ఏఐ టూల్స్ ద్వారా నివేదికల తయారీని ఎలా సులభతరం చేయవచ్చో వివరించారు. మొబైల్ ఫోన్ల ద్వారా ప్రత్యక్ష ప్రదర్శన నిర్వహించి అధ్యాపకులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి రసాయన శాస్త్ర విభాగానికి చెందిన డా. వి. శేఖర్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డా. మధు ధర్మపురి సహకరించారు. బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి