Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లైబ్రరీలు విజ్ఞాన భాండాగారాలు. పుస్తక పఠనంతో చరిత్రపై అవగాహన పెరుగుతుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ పూల శివప్రసాద్ ఆధ్వర్యంలో పాలకవర్గ సర్వసభ్య సమావేశం సత్యసాయి తాగునీటి కార్మికులకు వైసీపీ మద్దతు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ லஞ்ச் பாக்ஸுடன் செயலகத்திற்கு முதல்வர் விஜய்.. சாதாரண ஊழியரைப் போல புதிய பணிமுறை వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 16, 2026 07:33 PM

డబుల్ బెడ్‌రూమ్ లబ్ధిదారులకు న్యాయం చేస్తాం

డబుల్ బెడ్‌రూమ్ లబ్ధిదారులకు న్యాయం చేస్తాం

డబుల్ బెడ్‌రూమ్ లబ్ధిదారులకు న్యాయం చేస్తాం
May 16, 2026 06:20 PM 7 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మహేశ్వరం: మహంకాల్–1 డబుల్ బెడ్‌రూమ్ లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని టీపీసీసీ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దేప భాస్కర్‌రెడ్డి హామీ ఇచ్చారు. తుక్కుగూడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులు ఆయనను కలిసి తమ సమస్యలను వివరించారు.

ఈ సందర్భంగా దేప భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మహంకాల్–1 పరిధిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరైనా, హైకోర్టు కేసు కారణంగా గృహ ప్రవేశాలు నిలిచిపోయాయని తెలిపారు. అనంతరం జరిగిన రీ–ఎంక్వైరీలో అర్హులైన 141 మంది లబ్ధిదారులను అధికారులు గుర్తించి జిల్లా కలెక్టర్, హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్‌కు నివేదికలు అందించారని చెప్పారు.

ఇళ్ల కేటాయింపులో ఆలస్యం జరుగుతోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేయగా, వారికి పూర్తి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

ఈ అంశాన్ని నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే గృహ ప్రవేశాలు జరిగేలా కృషి చేస్తామని తెలిపారు.

కార్యక్రమంలో డబుల్ బెడ్‌రూమ్ లబ్ధిదారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News