డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు న్యాయం చేస్తాం
డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు న్యాయం చేస్తాం
Editor Desk
మహేశ్వరం: మహంకాల్–1 డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని టీపీసీసీ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దేప భాస్కర్రెడ్డి హామీ ఇచ్చారు. తుక్కుగూడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులు ఆయనను కలిసి తమ సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా దేప భాస్కర్రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మహంకాల్–1 పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరైనా, హైకోర్టు కేసు కారణంగా గృహ ప్రవేశాలు నిలిచిపోయాయని తెలిపారు. అనంతరం జరిగిన రీ–ఎంక్వైరీలో అర్హులైన 141 మంది లబ్ధిదారులను అధికారులు గుర్తించి జిల్లా కలెక్టర్, హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్కు నివేదికలు అందించారని చెప్పారు.
ఇళ్ల కేటాయింపులో ఆలస్యం జరుగుతోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేయగా, వారికి పూర్తి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
ఈ అంశాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, మంత్రి శ్రీధర్బాబు దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే గృహ ప్రవేశాలు జరిగేలా కృషి చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి