Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:54 AM

డెంగ్యూపై అవగాహన అవసరం. జిల్లా ఆస్పత్రిలో ర్యాలీ, సదస్సు

డెంగ్యూపై అవగాహన అవసరం. జిల్లా ఆస్పత్రిలో ర్యాలీ, సదస్సు

డెంగ్యూపై అవగాహన అవసరం. జిల్లా ఆస్పత్రిలో ర్యాలీ, సదస్సు
16-05-2026 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. జిల్లా కీటక జనిత వ్యాధుల ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఎన్. వంశీకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పాండు నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా డాక్టర్ పాండు నాయక్ మాట్లాడుతూ ఎడిస్ దోమ కాటు వల్ల తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, వాంతులు, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. నిర్లక్ష్యం చేస్తే ప్లేట్లెట్లు తగ్గి ప్రాణాపాయం ఏర్పడే ప్రమాదం ఉందన్నారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, నిల్వ నీరు లేకుండా చూసుకోవడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

డాక్టర్ ఎన్. వంశీకృష్ణ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా దోమల నివారణకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది డెంగ్యూ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయని వెల్లడించారు.

కార్యక్రమంలో ఆర్‌ఎంఓ డాక్టర్ కిరణ్, డాక్టర్ వీణ, డాక్టర్ స్వరాజ్ లక్ష్మి, డాక్టర్ విజయ్ పాటిల్, దీనరాణి, మలేరియా అధికారి నరసయ్య, హెల్త్ ఎడ్యుకేటర్ సత్యనారాయణ, సీహెచ్‌వో జ్ఞానేశ్వర్, నర్సింగ్ విద్యార్థినులు పాల్గొన్నారు

Sthanikam

డెంగ్యూపై అవగాహన అవసరం. జిల్లా ఆస్పత్రిలో ర్యాలీ, సదస్సు

Article Image

భువనగిరి: జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. జిల్లా కీటక జనిత వ్యాధుల ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఎన్. వంశీకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పాండు నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా డాక్టర్ పాండు నాయక్ మాట్లాడుతూ ఎడిస్ దోమ కాటు వల్ల తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, వాంతులు, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. నిర్లక్ష్యం చేస్తే ప్లేట్లెట్లు తగ్గి ప్రాణాపాయం ఏర్పడే ప్రమాదం ఉందన్నారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, నిల్వ నీరు లేకుండా చూసుకోవడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

డాక్టర్ ఎన్. వంశీకృష్ణ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా దోమల నివారణకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది డెంగ్యూ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయని వెల్లడించారు.

కార్యక్రమంలో ఆర్‌ఎంఓ డాక్టర్ కిరణ్, డాక్టర్ వీణ, డాక్టర్ స్వరాజ్ లక్ష్మి, డాక్టర్ విజయ్ పాటిల్, దీనరాణి, మలేరియా అధికారి నరసయ్య, హెల్త్ ఎడ్యుకేటర్ సత్యనారాయణ, సీహెచ్‌వో జ్ఞానేశ్వర్, నర్సింగ్ విద్యార్థినులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News