Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ధాన్యం కోసం పోరాడితే అరెస్టులా..? రైతు నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ పూల శివప్రసాద్ ఆధ్వర్యంలో పాలకవర్గ సర్వసభ్య సమావేశం సత్యసాయి తాగునీటి కార్మికులకు వైసీపీ మద్దతు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ லஞ்ச் பாக்ஸுடன் செயலகத்திற்கு முதல்வர் விஜய்.. சாதாரண ஊழியரைப் போல புதிய பணிமுறை వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 16, 2026 09:49 PM

డెంగ్యూపై అవగాహన అవసరం. జిల్లా ఆస్పత్రిలో ర్యాలీ, సదస్సు

డెంగ్యూపై అవగాహన అవసరం. జిల్లా ఆస్పత్రిలో ర్యాలీ, సదస్సు

డెంగ్యూపై అవగాహన అవసరం. జిల్లా ఆస్పత్రిలో ర్యాలీ, సదస్సు
May 16, 2026 08:27 PM 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. జిల్లా కీటక జనిత వ్యాధుల ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఎన్. వంశీకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పాండు నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా డాక్టర్ పాండు నాయక్ మాట్లాడుతూ ఎడిస్ దోమ కాటు వల్ల తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, వాంతులు, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. నిర్లక్ష్యం చేస్తే ప్లేట్లెట్లు తగ్గి ప్రాణాపాయం ఏర్పడే ప్రమాదం ఉందన్నారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, నిల్వ నీరు లేకుండా చూసుకోవడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

డాక్టర్ ఎన్. వంశీకృష్ణ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా దోమల నివారణకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది డెంగ్యూ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయని వెల్లడించారు.

కార్యక్రమంలో ఆర్‌ఎంఓ డాక్టర్ కిరణ్, డాక్టర్ వీణ, డాక్టర్ స్వరాజ్ లక్ష్మి, డాక్టర్ విజయ్ పాటిల్, దీనరాణి, మలేరియా అధికారి నరసయ్య, హెల్త్ ఎడ్యుకేటర్ సత్యనారాయణ, సీహెచ్‌వో జ్ఞానేశ్వర్, నర్సింగ్ విద్యార్థినులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News