Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 05:51 AM

ప్రొ. రాం రెడ్డి సేవలు చిరస్మరణీయం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో విగ్రహావిష్కరణ

ప్రొ. రాం రెడ్డి సేవలు చిరస్మరణీయం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో విగ్రహావిష్కరణ

ప్రొ. రాం రెడ్డి సేవలు చిరస్మరణీయం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో విగ్రహావిష్కరణ
May 16, 2026 05:42 PM 145 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్: దూరవిద్య పితామహుడు, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వ్యవస్థాపక వైస్‌ ఛాన్సలర్ ప్రొ. జి. రాం రెడ్డి సేవలు మరువలేనివని వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి అన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రొ. రాం రెడ్డి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన “లీడర్‌షిప్ కనెక్ట్” కార్యక్రమంలో ప్రొ. చక్రపాణి మాట్లాడుతూ దూరవిద్య విస్తరణకు ప్రొ. రాం రెడ్డి చేసిన కృషి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు. అనేక సార్వత్రిక విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ఆయన మార్గదర్శకులయ్యారని పేర్కొన్నారు. అనంతరం సీఎస్టీడీ భవనంలో ఏర్పాటు చేసిన ప్రొ. ఆర్‌వీఆర్ చంద్రశేఖర్‌రావు సినర్జీ హాల్‌ను ప్రారంభించారు.

పద్మ అవార్డుతో గౌరవించాలి

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం మాజీ ఆచార్యులు ప్రొ. జి. హరగోపాల్ మాట్లాడుతూ ప్రొ. రాం రెడ్డి సేవలకు గుర్తింపుగా పద్మ అవార్డు ప్రకటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

మాజీ వీసీ ప్రొ. వి.ఎస్. ప్రసాద్ మాట్లాడుతూ ప్రొ. రాం రెడ్డి దార్శనికతను కొనియాడారు. విశ్వవిద్యాలయం అభివృద్ధికి ఆయన వేసిన పునాదులు ఇప్పటికీ మార్గనిర్దేశకంగా ఉన్నాయని తెలిపారు.

కార్యక్రమంలో ప్రమీలా రాం రెడ్డి, జ్యోతి, ప్రొ. జి. పుష్పా చక్రపాణి, డా. ఎల్. విజయకృష్ణారెడ్డి, అధ్యాపకులు, మాజీ ప్రొఫెసర్లు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News