Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Lecture on AI Tools for Report Preparation Held at GDC Hayathnagar స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ லஞ்ச் பாக்ஸுடன் செயலகத்திற்கு முதல்வர் விஜய்.. சாதாரண ஊழியரைப் போல புதிய பணிமுறை ఆర్. డి. టీ సంస్థ కి సహాయం చేయడం నా అదృష్టం :- లోకేష్ సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 16, 2026 06:49 PM

ప్రొ. రాం రెడ్డి సేవలు చిరస్మరణీయం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో విగ్రహావిష్కరణ

ప్రొ. రాం రెడ్డి సేవలు చిరస్మరణీయం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో విగ్రహావిష్కరణ

ప్రొ. రాం రెడ్డి సేవలు చిరస్మరణీయం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో విగ్రహావిష్కరణ
May 16, 2026 05:42 PM 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్: దూరవిద్య పితామహుడు, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వ్యవస్థాపక వైస్‌ ఛాన్సలర్ ప్రొ. జి. రాం రెడ్డి సేవలు మరువలేనివని వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి అన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రొ. రాం రెడ్డి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన “లీడర్‌షిప్ కనెక్ట్” కార్యక్రమంలో ప్రొ. చక్రపాణి మాట్లాడుతూ దూరవిద్య విస్తరణకు ప్రొ. రాం రెడ్డి చేసిన కృషి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు. అనేక సార్వత్రిక విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ఆయన మార్గదర్శకులయ్యారని పేర్కొన్నారు. అనంతరం సీఎస్టీడీ భవనంలో ఏర్పాటు చేసిన ప్రొ. ఆర్‌వీఆర్ చంద్రశేఖర్‌రావు సినర్జీ హాల్‌ను ప్రారంభించారు.

పద్మ అవార్డుతో గౌరవించాలి

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం మాజీ ఆచార్యులు ప్రొ. జి. హరగోపాల్ మాట్లాడుతూ ప్రొ. రాం రెడ్డి సేవలకు గుర్తింపుగా పద్మ అవార్డు ప్రకటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

మాజీ వీసీ ప్రొ. వి.ఎస్. ప్రసాద్ మాట్లాడుతూ ప్రొ. రాం రెడ్డి దార్శనికతను కొనియాడారు. విశ్వవిద్యాలయం అభివృద్ధికి ఆయన వేసిన పునాదులు ఇప్పటికీ మార్గనిర్దేశకంగా ఉన్నాయని తెలిపారు.

కార్యక్రమంలో ప్రమీలా రాం రెడ్డి, జ్యోతి, ప్రొ. జి. పుష్పా చక్రపాణి, డా. ఎల్. విజయకృష్ణారెడ్డి, అధ్యాపకులు, మాజీ ప్రొఫెసర్లు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News