సీజ్ వాహనం వేలం.. ఎక్సైజ్ శాఖ ప్రకటన
సీజ్ వాహనం వేలం.. ఎక్సైజ్ శాఖ ప్రకటన
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో ఎక్సైజ్ కేసులో సీజ్ చేసిన వాహనాన్ని అధికారులు పబ్లిక్ వేలం ద్వారా విక్రయించనున్నారు. జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ రామన్నపేట ఆధ్వర్యంలో ఈ వేలం నిర్వహించబడనుంది.
వివరాల్లోకి వెళితే.. కేసు నం. 52/2025 (19-09-2025)లో పట్టుబడిన వాహనాన్ని మే 5, 2026న ఉదయం 11 గంటలకు రామన్నపేట కార్యాలయంలో వేలం వేయనున్నారు. ఆసక్తి గల వారు ప్రత్యక్షంగా హాజరై వేలంలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు.
వేలంలో పెట్టిన వాహనం వివరాలు ఇలా ఉన్నాయి:
టాటా ఇండికా విస్టా ఆక్వా క్వాడ్రాజెట్ (BS-IV), నమోదు సంఖ్య AP36AK3824, మోడల్ 2010. ఈ వాహనానికి అప్సెట్ విలువ ₹32,100గా నిర్ణయించారు. వాహనం రోడ్డు ప్రయాణానికి అనర్హమని పేర్కొన్నారు.
వేలంలో పాల్గొనదలచిన వారు అప్సెట్ విలువలో 50 శాతం ముందుగా చెల్లించి, మిగిలిన మొత్తాన్ని గడువులోపు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి