Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:22 AM

ఉచిత విద్యుత్ అమలు చేసినందుకు మంత్రి సవితమ్మకు చేనేతల అభినందనలు

ఉచిత విద్యుత్ అమలు చేసినందుకు మంత్రి సవితమ్మకు చేనేతల అభినందనలు

ఉచిత విద్యుత్ అమలు చేసినందుకు మంత్రి సవితమ్మకు చేనేతల అభినందనలు
May 16, 2026 07:02 PM 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం చేనేతల కోసం ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ చేనేత కార్మికులు మంత్రి సవితమ్మ ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా చేనేతలు మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చేనేత కుటుంబాలపై ఉన్న ఆర్థిక భారం తగ్గి, వృత్తికి మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, ముఖ్యంగా చిన్న స్థాయి చేనేత కార్మికులకు ఇది ఎంతో మేలు చేస్తుందని తెలిపారు.మంత్రి సవితమ్మ మాట్లాడుతూ, చేనేత కార్మికుల సంక్షేమం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వారి అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చేనేత రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు చేనేతలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News