ఉచిత విద్యుత్ అమలు చేసినందుకు మంత్రి సవితమ్మకు చేనేతల అభినందనలు
ఉచిత విద్యుత్ అమలు చేసినందుకు మంత్రి సవితమ్మకు చేనేతల అభినందనలు
Anjali
పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం చేనేతల కోసం ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ చేనేత కార్మికులు మంత్రి సవితమ్మ ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా చేనేతలు మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చేనేత కుటుంబాలపై ఉన్న ఆర్థిక భారం తగ్గి, వృత్తికి మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, ముఖ్యంగా చిన్న స్థాయి చేనేత కార్మికులకు ఇది ఎంతో మేలు చేస్తుందని తెలిపారు.మంత్రి సవితమ్మ మాట్లాడుతూ, చేనేత కార్మికుల సంక్షేమం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వారి అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చేనేత రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు చేనేతలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి