మానవ అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలి. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు
మానవ అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలి. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు
Editor Desk
భువనగిరి, : మానవ అక్రమ రవాణా తీవ్రమైన నేరమని, అలాంటి కార్యకలాపాలకు పాల్పడినా, ప్రోత్సహించినా కఠిన శిక్షలు తప్పవని లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ ఎస్. సాయిశ్రీనివాస్, ఎన్. రాజశేఖర్ అన్నారు.
జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు సూచనల మేరకు భువనగిరి పట్టణంలోని తాతానగర్లో స్కీడ్ స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, స్కీడ్ స్వచ్ఛంద సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో హెచ్ఆర్జీ కమ్యూనిటీ సభ్యులు, ఇతరులకు మానవ అక్రమ రవాణా నిరోధక చట్టాలపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లైంగిక దోపిడి, వెట్టిచాకిరి, చిన్నారులతో బిక్షాటన వంటి అవసరాల కోసం మనుషులను అక్రమంగా రవాణా చేయడం నేరమన్నారు. ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ వ్యవస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. బాధితులకు న్యాయ సహాయం అందించేందుకు జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు.
స్కీడ్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్. నాగరాజు మాట్లాడుతూ బాధితులను గుర్తించి వారికి మానవతా దృక్పథంతో సేవలు అందిస్తున్నామని తెలిపారు.
కార్యక్రమంలో హెచ్ఐవీ–ఎయిడ్స్ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ వంశీకృష్ణ, ప్రాజెక్ట్ మేనేజర్ భానుకుమార్, సెంట్రల్ కోఆర్డినేటర్ మిథున్, ఆర్గనైజర్ వెంకటేష్, కమ్యూనిటీ సభ్యులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి