Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లైబ్రరీలు విజ్ఞాన భాండాగారాలు. పుస్తక పఠనంతో చరిత్రపై అవగాహన పెరుగుతుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ పూల శివప్రసాద్ ఆధ్వర్యంలో పాలకవర్గ సర్వసభ్య సమావేశం సత్యసాయి తాగునీటి కార్మికులకు వైసీపీ మద్దతు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ லஞ்ச் பாக்ஸுடன் செயலகத்திற்கு முதல்வர் விஜய்.. சாதாரண ஊழியரைப் போல புதிய பணிமுறை వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 16, 2026 07:28 PM

వికలాంగుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి

వికలాంగుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి

వికలాంగుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి
May 16, 2026 06:16 PM 6 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్టలో ఈనెల 29 నుంచి శిక్షణ తరగతులు

బొమ్మలరామారం: వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 29, 30, 31 తేదీలలో యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో నిర్వహించే రాష్ట్ర శిక్షణ తరగతులు, రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ఎన్‌పీఆర్‌డీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ పిలుపునిచ్చారు.

బొమ్మలరామారం మండలంలోని చౌదరిపల్లి, లక్ష్మీ తండా, చికాడిమామిడి గ్రామాల్లో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. మండలంలో వికలాంగులకు సదరం సర్టిఫికెట్లు వచ్చినా మూడేళ్లు గడిచినా పెన్షన్లు మంజూరు కావడం లేదన్నారు. యూడీఐడీ కార్డులు వెంటనే అందించడంతో పాటు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

వికలాంగులకు ఇంద్రమ్మ ఇళ్లు ఇవ్వడం లేదని, ఉపాధి హామీ పథకంలో పనులు కూడా కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగా 150 రోజుల పని కల్పించి రోజుకు రూ.600 కూలి చెల్లించాలని కోరారు.

రాష్ట్ర సదస్సులో వికలాంగుల హక్కుల కోసం చేపట్టాల్సిన పోరాట కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 17 మండలాల నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొని సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో కొత్త లలిత, టీ. జాంగిర్, నమూనా బాలరాజు, టీ. రవి, మైలారం బిక్షపతి, పుట్ట అనూష, పిట్ట కొండల్, ధీరావత్ నరసింహ, ధీరావత్ రాజేందర్, ధీరావత్ రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News