Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:53 AM

వికలాంగుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి

వికలాంగుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి

వికలాంగుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి
16-05-2026 218 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్టలో ఈనెల 29 నుంచి శిక్షణ తరగతులు

బొమ్మలరామారం: వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 29, 30, 31 తేదీలలో యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో నిర్వహించే రాష్ట్ర శిక్షణ తరగతులు, రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ఎన్‌పీఆర్‌డీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ పిలుపునిచ్చారు.

బొమ్మలరామారం మండలంలోని చౌదరిపల్లి, లక్ష్మీ తండా, చికాడిమామిడి గ్రామాల్లో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. మండలంలో వికలాంగులకు సదరం సర్టిఫికెట్లు వచ్చినా మూడేళ్లు గడిచినా పెన్షన్లు మంజూరు కావడం లేదన్నారు. యూడీఐడీ కార్డులు వెంటనే అందించడంతో పాటు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

వికలాంగులకు ఇంద్రమ్మ ఇళ్లు ఇవ్వడం లేదని, ఉపాధి హామీ పథకంలో పనులు కూడా కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగా 150 రోజుల పని కల్పించి రోజుకు రూ.600 కూలి చెల్లించాలని కోరారు.

రాష్ట్ర సదస్సులో వికలాంగుల హక్కుల కోసం చేపట్టాల్సిన పోరాట కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 17 మండలాల నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొని సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో కొత్త లలిత, టీ. జాంగిర్, నమూనా బాలరాజు, టీ. రవి, మైలారం బిక్షపతి, పుట్ట అనూష, పిట్ట కొండల్, ధీరావత్ నరసింహ, ధీరావత్ రాజేందర్, ధీరావత్ రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వికలాంగుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి

Article Image

యాదగిరిగుట్టలో ఈనెల 29 నుంచి శిక్షణ తరగతులు

బొమ్మలరామారం: వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 29, 30, 31 తేదీలలో యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో నిర్వహించే రాష్ట్ర శిక్షణ తరగతులు, రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ఎన్‌పీఆర్‌డీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ పిలుపునిచ్చారు.

బొమ్మలరామారం మండలంలోని చౌదరిపల్లి, లక్ష్మీ తండా, చికాడిమామిడి గ్రామాల్లో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. మండలంలో వికలాంగులకు సదరం సర్టిఫికెట్లు వచ్చినా మూడేళ్లు గడిచినా పెన్షన్లు మంజూరు కావడం లేదన్నారు. యూడీఐడీ కార్డులు వెంటనే అందించడంతో పాటు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

వికలాంగులకు ఇంద్రమ్మ ఇళ్లు ఇవ్వడం లేదని, ఉపాధి హామీ పథకంలో పనులు కూడా కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగా 150 రోజుల పని కల్పించి రోజుకు రూ.600 కూలి చెల్లించాలని కోరారు.

రాష్ట్ర సదస్సులో వికలాంగుల హక్కుల కోసం చేపట్టాల్సిన పోరాట కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 17 మండలాల నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొని సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో కొత్త లలిత, టీ. జాంగిర్, నమూనా బాలరాజు, టీ. రవి, మైలారం బిక్షపతి, పుట్ట అనూష, పిట్ట కొండల్, ధీరావత్ నరసింహ, ధీరావత్ రాజేందర్, ధీరావత్ రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News