Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 05:52 AM

వికలాంగుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి

వికలాంగుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి

వికలాంగుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి
May 16, 2026 06:16 PM 215 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్టలో ఈనెల 29 నుంచి శిక్షణ తరగతులు

బొమ్మలరామారం: వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 29, 30, 31 తేదీలలో యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో నిర్వహించే రాష్ట్ర శిక్షణ తరగతులు, రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ఎన్‌పీఆర్‌డీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ పిలుపునిచ్చారు.

బొమ్మలరామారం మండలంలోని చౌదరిపల్లి, లక్ష్మీ తండా, చికాడిమామిడి గ్రామాల్లో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. మండలంలో వికలాంగులకు సదరం సర్టిఫికెట్లు వచ్చినా మూడేళ్లు గడిచినా పెన్షన్లు మంజూరు కావడం లేదన్నారు. యూడీఐడీ కార్డులు వెంటనే అందించడంతో పాటు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

వికలాంగులకు ఇంద్రమ్మ ఇళ్లు ఇవ్వడం లేదని, ఉపాధి హామీ పథకంలో పనులు కూడా కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగా 150 రోజుల పని కల్పించి రోజుకు రూ.600 కూలి చెల్లించాలని కోరారు.

రాష్ట్ర సదస్సులో వికలాంగుల హక్కుల కోసం చేపట్టాల్సిన పోరాట కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 17 మండలాల నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొని సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో కొత్త లలిత, టీ. జాంగిర్, నమూనా బాలరాజు, టీ. రవి, మైలారం బిక్షపతి, పుట్ట అనూష, పిట్ట కొండల్, ధీరావత్ నరసింహ, ధీరావత్ రాజేందర్, ధీరావత్ రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News