వికలాంగుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి
వికలాంగుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి
Editor Desk
యాదగిరిగుట్టలో ఈనెల 29 నుంచి శిక్షణ తరగతులు
బొమ్మలరామారం: వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 29, 30, 31 తేదీలలో యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో నిర్వహించే రాష్ట్ర శిక్షణ తరగతులు, రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ఎన్పీఆర్డీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ పిలుపునిచ్చారు.
బొమ్మలరామారం మండలంలోని చౌదరిపల్లి, లక్ష్మీ తండా, చికాడిమామిడి గ్రామాల్లో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. మండలంలో వికలాంగులకు సదరం సర్టిఫికెట్లు వచ్చినా మూడేళ్లు గడిచినా పెన్షన్లు మంజూరు కావడం లేదన్నారు. యూడీఐడీ కార్డులు వెంటనే అందించడంతో పాటు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
వికలాంగులకు ఇంద్రమ్మ ఇళ్లు ఇవ్వడం లేదని, ఉపాధి హామీ పథకంలో పనులు కూడా కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగా 150 రోజుల పని కల్పించి రోజుకు రూ.600 కూలి చెల్లించాలని కోరారు.
రాష్ట్ర సదస్సులో వికలాంగుల హక్కుల కోసం చేపట్టాల్సిన పోరాట కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 17 మండలాల నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొని సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో కొత్త లలిత, టీ. జాంగిర్, నమూనా బాలరాజు, టీ. రవి, మైలారం బిక్షపతి, పుట్ట అనూష, పిట్ట కొండల్, ధీరావత్ నరసింహ, ధీరావత్ రాజేందర్, ధీరావత్ రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి