రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో ఆదివారం అకస్మాత్తుగా వడగండ్ల వాన కురిసింది. మెరుపులా వచ్చి సుమారు పది నిమిషాల పాటు రాళ్ల వర్షం పడడంతో గ్రామంలో నిల్వ ఉంచిన ధాన్యం పూర్తిగా తడిసిముద్దైంది.
పంటను ఆరబెట్టేందుకు కల్లాల్లో వేసిన ధాన్యం వడగండ్ల వానకు నానిపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా వర్షం పడడంతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం తక్షణమే నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహారం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి