మహిళలు ఆర్థిక స్వావలంభన సాధించాలి స్వయం శక్తితో ఎదగాలి
మహిళలు ఆర్థిక స్వావలంభన సాధించాలి స్వయం శక్తితో ఎదగాలి
Editor Desk
డిప్యూటీ కమీషనర్ శ్రీనివాస్
ఎల్బీనగర్
మహిళలు ఆర్ధిక స్వావలంభన సాధించాలని సరూర్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమీషనర్ బోనగిరి శ్రీనివాస్ అన్నారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం సరూర్ నగర్, ఎల్బీనగర్ సర్కిల్ల పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఏప్రిల్ నెలలో 30 సంఘాలకుగాను ఒక కోటి పన్నెండు లక్షల రూపాయలు చెక్కులను ఆయన పంపిణీ పంపిణి చేసి మాట్లాడారు. ఈకార్యక్రమంలో డిపిఓ ఎం. విక్రాంత్ రెడ్డి, ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్ జగదీష్, యూసీడి సిఓలు కృష్ణవేణి, సైదులు, సహదేవ్, నర్సింగ్ రావు, వెంకటేష్, రాకేష్ కుమార్, శోభన, యాకయ్య, టిఎల్ఎఫ్, ఎస్ఎల్ఎఫ్ ఓబీలు ఆర్ పిలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా యూసీడి - యుబిడి విభాగాల ఆధ్వర్యంలో పార్కుల నిర్వహణపై సరూర్ నగర్, హయత్ నగర్ సర్కిల్ల స్వయం సహాయక సంఘాల మహిళలకు యుబిడి డైరెక్టర్ సునందరెడ్డి శిక్షణనిచ్చారు. ఈ కార్యక్రమంలో యుబిడి మేనేజర్ లోకేష్, స్వయం సహాయక సంఘాల సభ్యులు సిఓలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి