Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 05:34 AM

మహిళలకు చట్ట అవగాహన – సమాజ మార్పుకు తొలి అడుగు

మహిళలకు చట్ట అవగాహన – సమాజ మార్పుకు తొలి అడుగు

మహిళలకు చట్ట అవగాహన – సమాజ మార్పుకు తొలి అడుగు
24-04-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

శ్రీ సత్యసాయి జిల్లా, సోమందేపల్లి: సోమందేపల్లి మండలంలోని ఎన్‌డీఆర్ కియా అనుబంధ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మహిళలకు సోమందేపల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫ్లెక్సీలు, ఫ్లకార్డుల ద్వారా మహిళలకు వివిధ చట్టాలపై సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు.

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ మహిళలు కుటుంబానికి మూలాధారం అని, వారి మాటలను కుటుంబ సభ్యులు ఎక్కువగా పాటించే అవకాశం ఉన్నందున మహిళలు కుటుంబాన్ని సరైన దిశలో నడిపించే శక్తిగా నిలవాలని సూచించారు.

కార్యక్రమంలో డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పిస్తూ పిల్లలను చెడు అలవాట్ల నుండి దూరంగా ఉంచి చదువులు, క్రీడలపై దృష్టి పెట్టేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని తెలిపారు. అలాగే పోక్సో చట్టం ప్రకారం మైనర్ బాలిక సమ్మతి చట్టబద్ధం కాదని స్పష్టం చేశారు.

మహిళల భద్రతపై చట్టపరమైన రక్షణ ఉందని, అవసరమైతే పోలీసుల సహాయం తీసుకోవచ్చని సూచించారు. రోడ్డు భద్రతలో భాగంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లేకపోతే ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమం ద్వారా మహిళలు తమ కుటుంబాలకు మార్గదర్శకత్వం ఇవ్వడం ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురాగలరని అధికారులు పేర్కొన్నారు. చట్టాలపై అవగాహన పెంపొందించుకొని నేరాల నివారణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

— జి. సుధాకర్ యాదవ్, ఎస్‌ఐ, సోమందేపల్లి పోలీస్ స్టేషన్

Sthanikam

మహిళలకు చట్ట అవగాహన – సమాజ మార్పుకు తొలి అడుగు

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా, సోమందేపల్లి: సోమందేపల్లి మండలంలోని ఎన్‌డీఆర్ కియా అనుబంధ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మహిళలకు సోమందేపల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫ్లెక్సీలు, ఫ్లకార్డుల ద్వారా మహిళలకు వివిధ చట్టాలపై సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు.

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ మహిళలు కుటుంబానికి మూలాధారం అని, వారి మాటలను కుటుంబ సభ్యులు ఎక్కువగా పాటించే అవకాశం ఉన్నందున మహిళలు కుటుంబాన్ని సరైన దిశలో నడిపించే శక్తిగా నిలవాలని సూచించారు.

కార్యక్రమంలో డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పిస్తూ పిల్లలను చెడు అలవాట్ల నుండి దూరంగా ఉంచి చదువులు, క్రీడలపై దృష్టి పెట్టేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని తెలిపారు. అలాగే పోక్సో చట్టం ప్రకారం మైనర్ బాలిక సమ్మతి చట్టబద్ధం కాదని స్పష్టం చేశారు.

మహిళల భద్రతపై చట్టపరమైన రక్షణ ఉందని, అవసరమైతే పోలీసుల సహాయం తీసుకోవచ్చని సూచించారు. రోడ్డు భద్రతలో భాగంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లేకపోతే ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమం ద్వారా మహిళలు తమ కుటుంబాలకు మార్గదర్శకత్వం ఇవ్వడం ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురాగలరని అధికారులు పేర్కొన్నారు. చట్టాలపై అవగాహన పెంపొందించుకొని నేరాల నివారణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

— జి. సుధాకర్ యాదవ్, ఎస్‌ఐ, సోమందేపల్లి పోలీస్ స్టేషన్

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News