Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజలను మోసం చేస్తే ప్రభుత్వాన్ని నిలదీస్తాం పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 09:34 PM

మహిళలకు చట్ట అవగాహన – సమాజ మార్పుకు తొలి అడుగు

మహిళలకు చట్ట అవగాహన – సమాజ మార్పుకు తొలి అడుగు

మహిళలకు చట్ట అవగాహన – సమాజ మార్పుకు తొలి అడుగు
April 24, 2026 08:35 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

శ్రీ సత్యసాయి జిల్లా, సోమందేపల్లి: సోమందేపల్లి మండలంలోని ఎన్‌డీఆర్ కియా అనుబంధ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మహిళలకు సోమందేపల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫ్లెక్సీలు, ఫ్లకార్డుల ద్వారా మహిళలకు వివిధ చట్టాలపై సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు.

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ మహిళలు కుటుంబానికి మూలాధారం అని, వారి మాటలను కుటుంబ సభ్యులు ఎక్కువగా పాటించే అవకాశం ఉన్నందున మహిళలు కుటుంబాన్ని సరైన దిశలో నడిపించే శక్తిగా నిలవాలని సూచించారు.

కార్యక్రమంలో డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పిస్తూ పిల్లలను చెడు అలవాట్ల నుండి దూరంగా ఉంచి చదువులు, క్రీడలపై దృష్టి పెట్టేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని తెలిపారు. అలాగే పోక్సో చట్టం ప్రకారం మైనర్ బాలిక సమ్మతి చట్టబద్ధం కాదని స్పష్టం చేశారు.

మహిళల భద్రతపై చట్టపరమైన రక్షణ ఉందని, అవసరమైతే పోలీసుల సహాయం తీసుకోవచ్చని సూచించారు. రోడ్డు భద్రతలో భాగంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లేకపోతే ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమం ద్వారా మహిళలు తమ కుటుంబాలకు మార్గదర్శకత్వం ఇవ్వడం ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురాగలరని అధికారులు పేర్కొన్నారు. చట్టాలపై అవగాహన పెంపొందించుకొని నేరాల నివారణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

— జి. సుధాకర్ యాదవ్, ఎస్‌ఐ, సోమందేపల్లి పోలీస్ స్టేషన్

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News