Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:01 AM

మహిళా సంఘాల ముసుగులో కమిషన్ల దందా!

మహిళా సంఘాల ముసుగులో కమిషన్ల దందా!

మహిళా సంఘాల ముసుగులో కమిషన్ల దందా!
27-04-2026 917 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ బంగారుగడ్డలో ఆర్పీ అరాచకం -లోన్‌కు రూ.1000 ‘కట్’ తప్పనిసరి...?

నిరుపేద మహిళలపై అదనపు భారం – భయంతో నోరు విప్పలేని బాధితులు

నిరుపేద మహిళలకు ఆర్థికంగా అండగా నిలవాల్సిన మహిళా సంఘాలు, ఇప్పుడు కొందరి చేతుల్లో ‘కమిషన్ల కేంద్రాలుగా’ మారుతున్నాయన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాలు అందించాల్సిన బాధ్యతలో ఉన్న రిసోర్స్ పర్సన్ (ఆర్పీ) తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని సభ్యుల నుంచి అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్న ఘటన చౌటుప్పల్ పరిధిలో కలకలం రేపుతోంది. బంగారుగడ్డ ప్రాంతానికి చెందిన మహిళా సంఘాలకు బ్యాంకు లోన్లు ఇప్పించే క్రమంలో ఆర్పీ శోభ బహిరంగంగానే ఒక్కో సభ్యురాలి నుంచి రూ.1000 చొప్పున ‘కమిషన్’ వసూలు చేస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. లోన్ ప్రాసెస్ చేయాలన్నా, సంతకాలు పెట్టాలన్నా డబ్బులు తప్పనిసరి చేస్తున్నారని వారు వాపోతున్నారు.ఇప్పటికే అప్పుల భారంతో బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న తమపై ఈ అదనపు భారం మోపడం అన్యాయమని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమాలపై అధికారులకు ఫిర్యాదు చేస్తే భవిష్యత్తులో లోన్లు రాకుండా చేస్తారనే భయంతో చాలామంది మౌనం వహిస్తున్నారు.మహిళా సాధికారత కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను కొందరు స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, మహిళా సంఘాల్లో జరుగుతున్న ఈ ‘కమిషన్ల’ దందాపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Sthanikam

మహిళా సంఘాల ముసుగులో కమిషన్ల దందా!

Article Image

చౌటుప్పల్ బంగారుగడ్డలో ఆర్పీ అరాచకం -లోన్‌కు రూ.1000 ‘కట్’ తప్పనిసరి...?

నిరుపేద మహిళలపై అదనపు భారం – భయంతో నోరు విప్పలేని బాధితులు

నిరుపేద మహిళలకు ఆర్థికంగా అండగా నిలవాల్సిన మహిళా సంఘాలు, ఇప్పుడు కొందరి చేతుల్లో ‘కమిషన్ల కేంద్రాలుగా’ మారుతున్నాయన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాలు అందించాల్సిన బాధ్యతలో ఉన్న రిసోర్స్ పర్సన్ (ఆర్పీ) తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని సభ్యుల నుంచి అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్న ఘటన చౌటుప్పల్ పరిధిలో కలకలం రేపుతోంది. బంగారుగడ్డ ప్రాంతానికి చెందిన మహిళా సంఘాలకు బ్యాంకు లోన్లు ఇప్పించే క్రమంలో ఆర్పీ శోభ బహిరంగంగానే ఒక్కో సభ్యురాలి నుంచి రూ.1000 చొప్పున ‘కమిషన్’ వసూలు చేస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. లోన్ ప్రాసెస్ చేయాలన్నా, సంతకాలు పెట్టాలన్నా డబ్బులు తప్పనిసరి చేస్తున్నారని వారు వాపోతున్నారు.ఇప్పటికే అప్పుల భారంతో బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న తమపై ఈ అదనపు భారం మోపడం అన్యాయమని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమాలపై అధికారులకు ఫిర్యాదు చేస్తే భవిష్యత్తులో లోన్లు రాకుండా చేస్తారనే భయంతో చాలామంది మౌనం వహిస్తున్నారు.మహిళా సాధికారత కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను కొందరు స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, మహిళా సంఘాల్లో జరుగుతున్న ఈ ‘కమిషన్ల’ దందాపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News