మహిళా పోలీస్ స్టేషన్లో అవినీతి బహిర్గతం ఇన్స్పెక్టర్, ఎస్ఐపై ఏసీబీ కేసు నమోదు
మహిళా పోలీస్ స్టేషన్లో అవినీతి బహిర్గతం ఇన్స్పెక్టర్, ఎస్ఐపై ఏసీబీ కేసు నమోదు
Editor Desk
వికారాబాద్: వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్లో అవినీతి వెలుగుచూసింది. లంచం డిమాండ్ చేసిన ఆరోపణలపై ఇన్స్పెక్టర్ సరోజా, ఎస్ఐ హెచ్. రాణిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.
ఏసీబీ తెలిపిన వివరాల ప్రకారం… ఒక కేసులో నోటీసులు జారీ చేయడానికి మొదట రూ.60 వేల లంచం కోరిన అధికారులు, ఫిర్యాదుదారుడి విజ్ఞప్తి మేరకు దాన్ని రూ.40 వేలకు తగ్గించారు. ఈ క్రమంలో మార్చి 23న ఫిర్యాదుదారు రూ.20 వేలు ఎస్ఐకు, ఇన్స్పెక్టర్ సమక్షంలో అందజేశాడు.
మిగిలిన మొత్తం ఇవ్వలేకపోయిన ఫిర్యాదుదారు ఏసీబీని ఆశ్రయించడంతో, అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టి కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ అధికారులు వెల్లడించారు.
లంచం అడిగితే 1064కు కాల్ చేయండి
ప్రభుత్వ ఉద్యోగులు లంచం కోరితే వెంటనే 1064 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ సూచించింది. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి