Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:15 PM

మహిళా పోలీస్ స్టేషన్‌లో అవినీతి బహిర్గతం ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐపై ఏసీబీ కేసు నమోదు

మహిళా పోలీస్ స్టేషన్‌లో అవినీతి బహిర్గతం ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐపై ఏసీబీ కేసు నమోదు

మహిళా పోలీస్ స్టేషన్‌లో అవినీతి బహిర్గతం ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐపై ఏసీబీ కేసు నమోదు
21-04-2026 246 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వికారాబాద్: వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్‌లో అవినీతి వెలుగుచూసింది. లంచం డిమాండ్ చేసిన ఆరోపణలపై ఇన్‌స్పెక్టర్ సరోజా, ఎస్‌ఐ హెచ్. రాణిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.

ఏసీబీ తెలిపిన వివరాల ప్రకారం… ఒక కేసులో నోటీసులు జారీ చేయడానికి మొదట రూ.60 వేల లంచం కోరిన అధికారులు, ఫిర్యాదుదారుడి విజ్ఞప్తి మేరకు దాన్ని రూ.40 వేలకు తగ్గించారు. ఈ క్రమంలో మార్చి 23న ఫిర్యాదుదారు రూ.20 వేలు ఎస్‌ఐకు, ఇన్‌స్పెక్టర్ సమక్షంలో అందజేశాడు.

మిగిలిన మొత్తం ఇవ్వలేకపోయిన ఫిర్యాదుదారు ఏసీబీని ఆశ్రయించడంతో, అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టి కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ అధికారులు వెల్లడించారు.

లంచం అడిగితే 1064కు కాల్ చేయండి

ప్రభుత్వ ఉద్యోగులు లంచం కోరితే వెంటనే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ సూచించింది. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించింది.

Sthanikam

మహిళా పోలీస్ స్టేషన్‌లో అవినీతి బహిర్గతం ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐపై ఏసీబీ కేసు నమోదు

Article Image

వికారాబాద్: వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్‌లో అవినీతి వెలుగుచూసింది. లంచం డిమాండ్ చేసిన ఆరోపణలపై ఇన్‌స్పెక్టర్ సరోజా, ఎస్‌ఐ హెచ్. రాణిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.

ఏసీబీ తెలిపిన వివరాల ప్రకారం… ఒక కేసులో నోటీసులు జారీ చేయడానికి మొదట రూ.60 వేల లంచం కోరిన అధికారులు, ఫిర్యాదుదారుడి విజ్ఞప్తి మేరకు దాన్ని రూ.40 వేలకు తగ్గించారు. ఈ క్రమంలో మార్చి 23న ఫిర్యాదుదారు రూ.20 వేలు ఎస్‌ఐకు, ఇన్‌స్పెక్టర్ సమక్షంలో అందజేశాడు.

మిగిలిన మొత్తం ఇవ్వలేకపోయిన ఫిర్యాదుదారు ఏసీబీని ఆశ్రయించడంతో, అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టి కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ అధికారులు వెల్లడించారు.

లంచం అడిగితే 1064కు కాల్ చేయండి

ప్రభుత్వ ఉద్యోగులు లంచం కోరితే వెంటనే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ సూచించింది. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించింది.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News