Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 10:57 PM

మహిళా కూలీల రాష్ట్ర క్లాసులను జయప్రదం చేయాలి – రాచకొండ రాములమ్మ

మహిళా కూలీల రాష్ట్ర క్లాసులను జయప్రదం చేయాలి – రాచకొండ రాములమ్మ

మహిళా కూలీల రాష్ట్ర క్లాసులను జయప్రదం చేయాలి – రాచకొండ రాములమ్మ
April 11, 2026 05:07 PM 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పర్వతగిరి మండలం దేవుని అన్నారంలో ఈనెల 13, 14 తేదీలలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా కూలీల రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులను విజయవంతం చేయాలని మహిళా కూలీల జిల్లా కన్వీనర్ రాచకొండ రాములమ్మ పిలుపునిచ్చారు.

ఒక ప్రకటనలో ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల వ్యవసాయ మహిళా కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో 80 శాతం కంటే ఎక్కువగా మహిళలే పనిచేస్తున్నప్పటికీ, కొత్త నిబంధనలతో వారికి ఉపాధి దొరకడం కష్టమైందన్నారు.

ఈ-కేవైసీ, రోజుకు రెండు సార్లు ఫోటోలు వంటి నిబంధనల కారణంగా మహిళా కూలీలు రెండు, మూడు కిలోమీటర్లు నడిచి పనికి వెళ్లినా, సాంకేతిక సమస్యలతో తిరిగి ఇంటికి రావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆ రోజు కూలి కూడా కోల్పోతున్నారని పేర్కొన్నారు.

పని ప్రదేశాల్లో కనీస మౌలిక వసతులు లేకపోవడంతో పలువురు మహిళలు వడదెబ్బలకు గురవుతున్నారని తెలిపారు. ఎన్నికల ముందు భూమిలేని పేద మహిళలకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం ఇస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు. ఉపాధి హామీ జాబ్ కార్డుల కోసం దరఖాస్తు చేసినా రెండేళ్లుగా ఇవ్వడం లేదన్నారు.

రెండు రోజులపాటు జరిగే ఈ శిక్షణా తరగతుల్లో మహిళా కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని మహిళా కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News