మహిళా విద్యకు మార్గదర్శి సావిత్రిబాయి పూలేకు నివాళి
మహిళా విద్యకు మార్గదర్శి సావిత్రిబాయి పూలేకు నివాళి
Editor Desk
క్లాక్టవర్ సెంటర్లో సావిత్రిబాయి పూలే వర్ధంతి నిర్వహణ
భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు Savitribai Phule వర్ధంతిని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ), భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో నల్లగొండ క్లాక్టవర్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఖమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ 1831 జనవరి 3న మహారాష్ట్రలోని నయాగావ్లో జన్మించిన సావిత్రిబాయి పూలే, తన భర్త Jyotirao Phule తో కలిసి 1848లో పూణేలో తొలి బాలికల పాఠశాలను స్థాపించారని తెలిపారు. మహిళా విద్య, సమానత్వం, కుల వివక్ష నిర్మూలన కోసం జీవితాంతం పోరాడిన ఆమె 1897 మార్చి 10న మరణించినట్లు పేర్కొన్నారు.
అజ్ఞానం, వివక్షలను ఎదిరించి మహిళలకు విద్యా హక్కు కల్పించిన మహానీయురాలిగా సావిత్రిబాయి పూలే నిలిచారని, ఆమె ఆదర్శాలు నేటి తరానికి మార్గదర్శకమని నాయకులు అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ డివైఎఫ్ఐ నాయకులు బిక్షం, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కో-కన్వీనర్ కుంచం కావ్య, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గుండాల నరేష్, ఎస్ఎఫ్ఐ నల్గొండ డివిజన్ కార్యదర్శి మారుపాక కిరణ్, రియాజ్, మహేష్, తరుణ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి