Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం.. హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: ఎమ్మెల్యే సంజీవరెడ్డి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:33 PM

మహిళా విద్యకు మార్గదర్శి సావిత్రిబాయి పూలేకు నివాళి

మహిళా విద్యకు మార్గదర్శి సావిత్రిబాయి పూలేకు నివాళి

మహిళా విద్యకు మార్గదర్శి సావిత్రిబాయి పూలేకు నివాళి
10-03-2026 236 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

క్లాక్‌టవర్ సెంటర్‌లో సావిత్రిబాయి పూలే వర్ధంతి నిర్వహణ

భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు Savitribai Phule వర్ధంతిని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ), భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో నల్లగొండ క్లాక్‌టవర్ సెంటర్‌లో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఖమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ 1831 జనవరి 3న మహారాష్ట్రలోని నయాగావ్‌లో జన్మించిన సావిత్రిబాయి పూలే, తన భర్త Jyotirao Phule తో కలిసి 1848లో పూణేలో తొలి బాలికల పాఠశాలను స్థాపించారని తెలిపారు. మహిళా విద్య, సమానత్వం, కుల వివక్ష నిర్మూలన కోసం జీవితాంతం పోరాడిన ఆమె 1897 మార్చి 10న మరణించినట్లు పేర్కొన్నారు.

అజ్ఞానం, వివక్షలను ఎదిరించి మహిళలకు విద్యా హక్కు కల్పించిన మహానీయురాలిగా సావిత్రిబాయి పూలే నిలిచారని, ఆమె ఆదర్శాలు నేటి తరానికి మార్గదర్శకమని నాయకులు అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ డివైఎఫ్‌ఐ నాయకులు బిక్షం, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర గర్ల్స్ కో-కన్వీనర్ కుంచం కావ్య, డివైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గుండాల నరేష్, ఎస్‌ఎఫ్‌ఐ నల్గొండ డివిజన్ కార్యదర్శి మారుపాక కిరణ్, రియాజ్, మహేష్, తరుణ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మహిళా విద్యకు మార్గదర్శి సావిత్రిబాయి పూలేకు నివాళి

Article Image

క్లాక్‌టవర్ సెంటర్‌లో సావిత్రిబాయి పూలే వర్ధంతి నిర్వహణ

భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు Savitribai Phule వర్ధంతిని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ), భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో నల్లగొండ క్లాక్‌టవర్ సెంటర్‌లో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఖమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ 1831 జనవరి 3న మహారాష్ట్రలోని నయాగావ్‌లో జన్మించిన సావిత్రిబాయి పూలే, తన భర్త Jyotirao Phule తో కలిసి 1848లో పూణేలో తొలి బాలికల పాఠశాలను స్థాపించారని తెలిపారు. మహిళా విద్య, సమానత్వం, కుల వివక్ష నిర్మూలన కోసం జీవితాంతం పోరాడిన ఆమె 1897 మార్చి 10న మరణించినట్లు పేర్కొన్నారు.

అజ్ఞానం, వివక్షలను ఎదిరించి మహిళలకు విద్యా హక్కు కల్పించిన మహానీయురాలిగా సావిత్రిబాయి పూలే నిలిచారని, ఆమె ఆదర్శాలు నేటి తరానికి మార్గదర్శకమని నాయకులు అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ డివైఎఫ్‌ఐ నాయకులు బిక్షం, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర గర్ల్స్ కో-కన్వీనర్ కుంచం కావ్య, డివైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గుండాల నరేష్, ఎస్‌ఎఫ్‌ఐ నల్గొండ డివిజన్ కార్యదర్శి మారుపాక కిరణ్, రియాజ్, మహేష్, తరుణ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News