Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సమ్మె శాంతియుతంగా జరగాలి – ఎస్పీ హెచ్చరిక ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 22, 2026 09:54 PM

మహిళ భద్రతపై విస్తృత అవగాహన కల్పించాలి రోడ్డు ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు అవసరం

మహిళ భద్రతపై విస్తృత అవగాహన కల్పించాలి రోడ్డు ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు అవసరం

మహిళ భద్రతపై విస్తృత అవగాహన కల్పించాలి రోడ్డు ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు అవసరం
April 22, 2026 08:10 PM 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ పెనుకొండ సబ్‌డివిజన్ పరిధిలోని కియా పోలీస్ స్టేషన్‌ను ఈరోజు వార్షిక తనిఖీ నిర్వహించారు.

ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని లాకప్ గది, కంప్యూటర్ విభాగం మరియు పరిసరాలను పరిశీలించారు. స్టేషన్ నిర్వహణ, రికార్డుల నిర్వహణ, లాంగ్ పెండింగ్ కేసులపై సమగ్ర సమీక్ష చేపట్టారు. మహిళల నుంచి వచ్చే ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యతతో స్వీకరించి, తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

పోలీసులు నిర్వహించే రికార్డులను పూర్తిగా పరిశీలించిన ఎస్పీ గారు, హైవేలపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కియా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల పరిస్థితులను తెలుసుకొని, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

అక్రమ మద్యం, ఇసుక రవాణా, పేకాట, క్రికెట్ బెట్టింగ్, మట్కా వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాల్య వివాహాలు, సైబర్ మోసాలు, పోక్సో కేసులు మరియు నూతన చట్టాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు.

నేరస్తులు, రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచి, విజిబుల్ పోలీసింగ్ పెంచాలని, హైవే పెట్రోలింగ్‌ను బలోపేతం చేయాలని సూచించారు. చోరీలను అరికట్టేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అవినీతికి తావులేకుండా నిబద్ధతతో ప్రజలకు సేవ చేయాలని, సిబ్బంది సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్పీ గారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిఎస్పీ నరసింగప్ప, సీసీ చిరంజీవి, ఎస్సైలు మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా పోలీస్ కార్యాలయం, పుట్టపర్తి

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News