Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యువతపై మహనీయుల ఆశయాల బాధ్యత – కళ్లెం కృష్ణ కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 06:05 PM

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహణ

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహణ

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహణ
April 11, 2026 04:30 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram

సూర్యాపేట పట్టణంలోని రాఘవ ప్లాజా సమీపంలో ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద శనివారం 199వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గిరిదుర్గం చైర్మన్, సూర్యాపేట మున్సిపాలిటీ కౌన్సిలర్ డాక్టర్ వూరా రామమూర్తి యాదవ్, డాక్టర్ సల్వాది రమేష్ కుమార్, తెలంగాణ రాష్ట్ర దళిత రత్న అవార్డు గ్రహీత డాక్టర్ భాషపంగు భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో సగభాగమైన మహిళలు అభివృద్ధి చెందకపోతే దేశ పురోగతి సాధ్యం కాదని మహాత్మ జ్యోతిరావు పూలే విశ్వసించారని తెలిపారు. మహిళా విద్యకు తొలి ప్రాధాన్యతనిస్తూ తన సతీమణి సావిత్రిబాయి పూలేను విద్యాభ్యాసానికి ప్రోత్సహించడం ద్వారా సమాజానికి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. అనాథ శిశువులకు ఆశ్రయం కల్పించడం, వితంతువుల పునర్వివాహానికి మద్దతు ఇవ్వడం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడం వంటి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ న్యాయవాది నాతి సవిందర్, ఎర్రమళ్ళ రాములు, ముద్దా బిక్షపతి యాదవ్, యాతాకుల సునీల్, భూక్యా రాజు నాయక్, నవీలే ఉపేందర్, పిడమర్తి లింగయ్య, వావిళ్ల రమేష్ గౌడ్, బాలు నాయక్, పోలోజు మహేష్ చారి, పోతుగంటి వీరచారి, భాషపంగు సమరం, బడుగుల నాగార్జున యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News