Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నూతన బాధ్యతలు చేపట్టిన రాజు పటేల్‌కు ఘన స్వాగతం కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 04, 2026 07:45 AM

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహణ

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహణ

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహణ
April 11, 2026 04:30 PM 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

సూర్యాపేట పట్టణంలోని రాఘవ ప్లాజా సమీపంలో ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద శనివారం 199వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గిరిదుర్గం చైర్మన్, సూర్యాపేట మున్సిపాలిటీ కౌన్సిలర్ డాక్టర్ వూరా రామమూర్తి యాదవ్, డాక్టర్ సల్వాది రమేష్ కుమార్, తెలంగాణ రాష్ట్ర దళిత రత్న అవార్డు గ్రహీత డాక్టర్ భాషపంగు భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో సగభాగమైన మహిళలు అభివృద్ధి చెందకపోతే దేశ పురోగతి సాధ్యం కాదని మహాత్మ జ్యోతిరావు పూలే విశ్వసించారని తెలిపారు. మహిళా విద్యకు తొలి ప్రాధాన్యతనిస్తూ తన సతీమణి సావిత్రిబాయి పూలేను విద్యాభ్యాసానికి ప్రోత్సహించడం ద్వారా సమాజానికి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. అనాథ శిశువులకు ఆశ్రయం కల్పించడం, వితంతువుల పునర్వివాహానికి మద్దతు ఇవ్వడం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడం వంటి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ న్యాయవాది నాతి సవిందర్, ఎర్రమళ్ళ రాములు, ముద్దా బిక్షపతి యాదవ్, యాతాకుల సునీల్, భూక్యా రాజు నాయక్, నవీలే ఉపేందర్, పిడమర్తి లింగయ్య, వావిళ్ల రమేష్ గౌడ్, బాలు నాయక్, పోలోజు మహేష్ చారి, పోతుగంటి వీరచారి, భాషపంగు సమరం, బడుగుల నాగార్జున యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News