Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:30 PM

"మహనీయుల స్పూర్తితో ఐక్యతను చాటుదాం"

"మహనీయుల స్పూర్తితో ఐక్యతను చాటుదాం"

"మహనీయుల స్పూర్తితో ఐక్యతను చాటుదాం"
14-04-2026 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

"జిల్లా కేంద్రంలో ఘనంగా భీమ్ యాత్ర"- భీమ్ యాత్రలో మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ నాయకులు

మహనీయులు మహాత్మా జ్యోతిరావు ఫూలే,బాబాసాహెబ్ అంబేద్కర్,బాబు జగ్జీవన్ రామ్ ల స్పూర్తితో అణగారిన వర్గాల ఐక్యతను చాటుదామని మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ నాయకులు అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన భీమ్ యాత్ర ప్రారంభం సందర్భంగా వారు మాట్లాడుతూ... సమాజంలో అసమానతలకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటిత పరచి విద్యా ఆవశ్యకతను తెలిపిన మహనీయుడు జ్యోతిరావు పూలే అయితే ఈ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించి మనుషులందరూ సమానమే అని సమాన హక్కులు కల్పించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని అలాగే హక్కులు అనేవి అడుక్కుంటే రావని పోరాడి సాధించుకోవాలని చెప్పిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు. వారు సూచించిన మార్గాలను, ఆశయాలను స్పూర్తిగా తీసుకొని నేటి తరం ముందుకు సాగాలని అన్నారు. భారత రాజ్యాంగ ఫలాలు అన్ని వర్గాల ప్రజలు అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన భీమ్ యాత్ర హైదరాబాద్ చౌరాస్తా నుండి ప్రారంభమై నల్గొండ చౌరస్తా, జంఖాన్ గూడా,బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తా, పాత బస్టాండ్ నుండి తిరిగి అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. యాత్ర లో పాల్గొన్న... బట్టు రాంచంద్రయ్య,నాగరం అంజయ్య,బర్రె జహంగీర్,దొనకొండ రాములు సురుపంగా శివలింగం,ఎండి.ఇలియస్, కర్తల శ్రీనివాస్,ఇటుకల దేవేందర్, కుతడి సురేష్,నాగరం శంకర్,కనుకుంట్ల రమేష్ కోటి,చింతల శివ ,వనం రాజు,కారుపటి రాజు,బర్రె నరేష్, కౌన్సిలర్స్,బొంతల నర్సింగ్ రావు, జాలిగం విగ్నేష్,బర్రె పూజిత,బట్టుపల్లి అనురాధ,బర్రె ప్రమీల,గాయపక శ్రవణ్,జాలిగం శివ,కాశపక మహేష్,ఆనంపట్ల కృష్ణ,దుబ్బ రామకృష్ణ మాదిగ సురేష్,వడ్డేపల్లి దాస్,హాస్టల్ విద్యార్థులు, జైభీం ఆటో యూనియన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

"మహనీయుల స్పూర్తితో ఐక్యతను చాటుదాం"

Article Image

"జిల్లా కేంద్రంలో ఘనంగా భీమ్ యాత్ర"- భీమ్ యాత్రలో మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ నాయకులు

మహనీయులు మహాత్మా జ్యోతిరావు ఫూలే,బాబాసాహెబ్ అంబేద్కర్,బాబు జగ్జీవన్ రామ్ ల స్పూర్తితో అణగారిన వర్గాల ఐక్యతను చాటుదామని మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ నాయకులు అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన భీమ్ యాత్ర ప్రారంభం సందర్భంగా వారు మాట్లాడుతూ... సమాజంలో అసమానతలకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటిత పరచి విద్యా ఆవశ్యకతను తెలిపిన మహనీయుడు జ్యోతిరావు పూలే అయితే ఈ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించి మనుషులందరూ సమానమే అని సమాన హక్కులు కల్పించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని అలాగే హక్కులు అనేవి అడుక్కుంటే రావని పోరాడి సాధించుకోవాలని చెప్పిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు. వారు సూచించిన మార్గాలను, ఆశయాలను స్పూర్తిగా తీసుకొని నేటి తరం ముందుకు సాగాలని అన్నారు. భారత రాజ్యాంగ ఫలాలు అన్ని వర్గాల ప్రజలు అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన భీమ్ యాత్ర హైదరాబాద్ చౌరాస్తా నుండి ప్రారంభమై నల్గొండ చౌరస్తా, జంఖాన్ గూడా,బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తా, పాత బస్టాండ్ నుండి తిరిగి అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. యాత్ర లో పాల్గొన్న... బట్టు రాంచంద్రయ్య,నాగరం అంజయ్య,బర్రె జహంగీర్,దొనకొండ రాములు సురుపంగా శివలింగం,ఎండి.ఇలియస్, కర్తల శ్రీనివాస్,ఇటుకల దేవేందర్, కుతడి సురేష్,నాగరం శంకర్,కనుకుంట్ల రమేష్ కోటి,చింతల శివ ,వనం రాజు,కారుపటి రాజు,బర్రె నరేష్, కౌన్సిలర్స్,బొంతల నర్సింగ్ రావు, జాలిగం విగ్నేష్,బర్రె పూజిత,బట్టుపల్లి అనురాధ,బర్రె ప్రమీల,గాయపక శ్రవణ్,జాలిగం శివ,కాశపక మహేష్,ఆనంపట్ల కృష్ణ,దుబ్బ రామకృష్ణ మాదిగ సురేష్,వడ్డేపల్లి దాస్,హాస్టల్ విద్యార్థులు, జైభీం ఆటో యూనియన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News