మహనీయుల జయంతి ఉత్సవాలకు కార్యాచరణపై బీజేపీ సమావేశం
మహనీయుల జయంతి ఉత్సవాలకు కార్యాచరణపై బీజేపీ సమావేశం
Editor Desk
యాదాద్రి భువనగిరి: జిల్లాలో మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు బీజేపీ జిల్లా కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్ గౌడ్ అధ్యక్షత వహించారు.
ఈ సమావేశంలో జ్యోతిరావు ఫూలే మరియు బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాల నిర్వహణపై విస్తృతంగా చర్చించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంతో పాటు పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించాలని సూచించారు. జిల్లా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభారి వర్ధన్ రెడ్డి, SIR జిల్లా కన్వీనర్ వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏలే చంద్రశేఖర్, తుమ్మల మురళీధర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పట్నం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శులు చందా మహేందర్, కొప్పుల యాదిరెడ్డి, కాదూరి అచ్చయ్య, జిల్లా కార్యదర్శి తడిసిన మల్లారెడ్డి, కమిటీ సభ్యులు కారి కృష్ణ, లక్ష్మీనారాయణ వైజయంతి, జిల్లా కోశాధికారి సోమ నరసయ్య గుప్తా, జిల్లా మీడియా కన్వీనర్ ఆకుతోట రామకృష్ణ, కార్యాలయ కార్యదర్శి మంగు నరసింహారావు, పట్టణ ప్రధాన కార్యదర్శి రాళ్ల బండి కృష్ణాచారి తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి