Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు నరాలు తెగే ఉత్కంఠ... ఢిల్లీ చేతిలో గెలుపు.. గుజరాత్ తన్నుకుపోయింది! “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 09, 2026 10:30 PM

మహనీయుల జయంతి ఉత్సవాలకు కార్యాచరణపై బీజేపీ సమావేశం

మహనీయుల జయంతి ఉత్సవాలకు కార్యాచరణపై బీజేపీ సమావేశం

మహనీయుల జయంతి ఉత్సవాలకు కార్యాచరణపై బీజేపీ సమావేశం
April 09, 2026 08:11 PM 16 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి: జిల్లాలో మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు బీజేపీ జిల్లా కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్ గౌడ్ అధ్యక్షత వహించారు.

ఈ సమావేశంలో జ్యోతిరావు ఫూలే మరియు బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాల నిర్వహణపై విస్తృతంగా చర్చించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంతో పాటు పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించాలని సూచించారు. జిల్లా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభారి వర్ధన్ రెడ్డి, SIR జిల్లా కన్వీనర్ వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏలే చంద్రశేఖర్, తుమ్మల మురళీధర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పట్నం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శులు చందా మహేందర్, కొప్పుల యాదిరెడ్డి, కాదూరి అచ్చయ్య, జిల్లా కార్యదర్శి తడిసిన మల్లారెడ్డి, కమిటీ సభ్యులు కారి కృష్ణ, లక్ష్మీనారాయణ వైజయంతి, జిల్లా కోశాధికారి సోమ నరసయ్య గుప్తా, జిల్లా మీడియా కన్వీనర్ ఆకుతోట రామకృష్ణ, కార్యాలయ కార్యదర్శి మంగు నరసింహారావు, పట్టణ ప్రధాన కార్యదర్శి రాళ్ల బండి కృష్ణాచారి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News