Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:49 PM

మడిగలు సీజ్.. బకాయిల భారం ఎట్టకేలకు బైటపడింది!

మడిగలు సీజ్.. బకాయిల భారం ఎట్టకేలకు బైటపడింది!

మడిగలు సీజ్.. బకాయిల భారం ఎట్టకేలకు బైటపడింది!
09-04-2026 194 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేటలో పాత బస్టాండ్ ఆవరణలోని జీపీ కాంప్లెక్స్ మడిగలను అధికారులు సీజ్ చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గత 3-4 సంవత్సరాలుగా షాపుదారులు కిరాయిలు చెల్లించకపోవడంతో పాటు, ఇటీవల కొన్ని నెలలుగా మూడుసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందన రాకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు కార్యదర్శి సైదిరెడ్డి తెలిపారు.

కాంప్లెక్స్‌లోని దుకాణాలకు సంబంధించిన భారీ మొత్తంలో బకాయిలు పేరుకుపోయినట్లు సమాచారం. ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో చివరకు సీజ్ చర్యలకు దిగినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, ఏరియా ఆస్పత్రి కాంప్లెక్స్‌లోని దుకాణాలపై కూడా బకాయిల సమస్య కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అక్కడి షాపుల విషయంలో కూడా ఇదే తరహా చర్యలు ఉంటాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు, గెస్ట్ హౌస్ కాంప్లెక్స్‌పై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదానిపై స్థానికంగా చర్చ జరుగుతోంది. బకాయిల వసూలు కోసం మరిన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారు

Sthanikam

మడిగలు సీజ్.. బకాయిల భారం ఎట్టకేలకు బైటపడింది!

Article Image

రామన్నపేటలో పాత బస్టాండ్ ఆవరణలోని జీపీ కాంప్లెక్స్ మడిగలను అధికారులు సీజ్ చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గత 3-4 సంవత్సరాలుగా షాపుదారులు కిరాయిలు చెల్లించకపోవడంతో పాటు, ఇటీవల కొన్ని నెలలుగా మూడుసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందన రాకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు కార్యదర్శి సైదిరెడ్డి తెలిపారు.

కాంప్లెక్స్‌లోని దుకాణాలకు సంబంధించిన భారీ మొత్తంలో బకాయిలు పేరుకుపోయినట్లు సమాచారం. ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో చివరకు సీజ్ చర్యలకు దిగినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, ఏరియా ఆస్పత్రి కాంప్లెక్స్‌లోని దుకాణాలపై కూడా బకాయిల సమస్య కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అక్కడి షాపుల విషయంలో కూడా ఇదే తరహా చర్యలు ఉంటాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు, గెస్ట్ హౌస్ కాంప్లెక్స్‌పై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదానిపై స్థానికంగా చర్చ జరుగుతోంది. బకాయిల వసూలు కోసం మరిన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News