Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం 10వ తరగతి మెమో పోగొట్టుకున్న యువకుడు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:55 PM

మడిగలు సీజ్.. బకాయిల భారం ఎట్టకేలకు బైటపడింది!

మడిగలు సీజ్.. బకాయిల భారం ఎట్టకేలకు బైటపడింది!

మడిగలు సీజ్.. బకాయిల భారం ఎట్టకేలకు బైటపడింది!
April 09, 2026 08:17 AM 190 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేటలో పాత బస్టాండ్ ఆవరణలోని జీపీ కాంప్లెక్స్ మడిగలను అధికారులు సీజ్ చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గత 3-4 సంవత్సరాలుగా షాపుదారులు కిరాయిలు చెల్లించకపోవడంతో పాటు, ఇటీవల కొన్ని నెలలుగా మూడుసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందన రాకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు కార్యదర్శి సైదిరెడ్డి తెలిపారు.

కాంప్లెక్స్‌లోని దుకాణాలకు సంబంధించిన భారీ మొత్తంలో బకాయిలు పేరుకుపోయినట్లు సమాచారం. ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో చివరకు సీజ్ చర్యలకు దిగినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, ఏరియా ఆస్పత్రి కాంప్లెక్స్‌లోని దుకాణాలపై కూడా బకాయిల సమస్య కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అక్కడి షాపుల విషయంలో కూడా ఇదే తరహా చర్యలు ఉంటాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు, గెస్ట్ హౌస్ కాంప్లెక్స్‌పై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదానిపై స్థానికంగా చర్చ జరుగుతోంది. బకాయిల వసూలు కోసం మరిన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News