మడిగలు సీజ్.. బకాయిల భారం ఎట్టకేలకు బైటపడింది!
మడిగలు సీజ్.. బకాయిల భారం ఎట్టకేలకు బైటపడింది!
Editor Desk
రామన్నపేటలో పాత బస్టాండ్ ఆవరణలోని జీపీ కాంప్లెక్స్ మడిగలను అధికారులు సీజ్ చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గత 3-4 సంవత్సరాలుగా షాపుదారులు కిరాయిలు చెల్లించకపోవడంతో పాటు, ఇటీవల కొన్ని నెలలుగా మూడుసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందన రాకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు కార్యదర్శి సైదిరెడ్డి తెలిపారు.
కాంప్లెక్స్లోని దుకాణాలకు సంబంధించిన భారీ మొత్తంలో బకాయిలు పేరుకుపోయినట్లు సమాచారం. ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో చివరకు సీజ్ చర్యలకు దిగినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ఏరియా ఆస్పత్రి కాంప్లెక్స్లోని దుకాణాలపై కూడా బకాయిల సమస్య కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అక్కడి షాపుల విషయంలో కూడా ఇదే తరహా చర్యలు ఉంటాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు, గెస్ట్ హౌస్ కాంప్లెక్స్పై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదానిపై స్థానికంగా చర్చ జరుగుతోంది. బకాయిల వసూలు కోసం మరిన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి