Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 06:18 AM

మధ్యాహ్న భోజన నాణ్యతపై ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ తప్పనిసరి: కలెక్టర్

మధ్యాహ్న భోజన నాణ్యతపై ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ తప్పనిసరి: కలెక్టర్

మధ్యాహ్న భోజన నాణ్యతపై ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ తప్పనిసరి: కలెక్టర్
March 09, 2026 06:29 PM 15 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి, మార్చి 9: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ మరియు ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం నాణ్యతపై ప్రత్యేక అధికారులు పకడ్బందీగా పర్యవేక్షణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.

సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 691 ప్రభుత్వ మరియు రెసిడెన్షియల్ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంపై ప్రత్యేక అధికారులు ప్రతిరోజూ పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాన్ని స్వయంగా రుచి చూడాలని సూచించారు. ఆహారం నాణ్యత, పరిశుభ్రత, మెనూ ప్రకారం వంట జరుగుతోందో లేదో పరిశీలించడంతో పాటు విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని అన్నారు.

మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు ప్రతిరోజూ పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు. ఎలాంటి లోపాలు ఉన్నా వెంటనే గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలని సూచించారు.

ప్రభుత్వ మరియు రెసిడెన్షియల్ పాఠశాలల్లో వంట సరుకులు, కూరగాయలు నాణ్యంగా ఉండేలా చూసుకోవడంతో పాటు వంటగదులు పరిశుభ్రంగా ఉంచాలని, తాగునీరు సక్రమంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం సమర్థవంతంగా అమలయ్యేలా ప్రత్యేక అధికారులు బాధ్యతతో విధులు నిర్వర్తించాలని సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News