మధ్యాహ్న భోజన నాణ్యతపై ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ తప్పనిసరి: కలెక్టర్
మధ్యాహ్న భోజన నాణ్యతపై ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ తప్పనిసరి: కలెక్టర్
Editor Desk
యాదాద్రి భువనగిరి, మార్చి 9: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ మరియు ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం నాణ్యతపై ప్రత్యేక అధికారులు పకడ్బందీగా పర్యవేక్షణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.
సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 691 ప్రభుత్వ మరియు రెసిడెన్షియల్ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంపై ప్రత్యేక అధికారులు ప్రతిరోజూ పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాన్ని స్వయంగా రుచి చూడాలని సూచించారు. ఆహారం నాణ్యత, పరిశుభ్రత, మెనూ ప్రకారం వంట జరుగుతోందో లేదో పరిశీలించడంతో పాటు విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని అన్నారు.
మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు ప్రతిరోజూ పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు. ఎలాంటి లోపాలు ఉన్నా వెంటనే గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలని సూచించారు.
ప్రభుత్వ మరియు రెసిడెన్షియల్ పాఠశాలల్లో వంట సరుకులు, కూరగాయలు నాణ్యంగా ఉండేలా చూసుకోవడంతో పాటు వంటగదులు పరిశుభ్రంగా ఉంచాలని, తాగునీరు సక్రమంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం సమర్థవంతంగా అమలయ్యేలా ప్రత్యేక అధికారులు బాధ్యతతో విధులు నిర్వర్తించాలని సూచించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి