Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:46 PM

లోతుకుంట కేజీబీవీలో అంబేద్కర్ జయంతి సందర్భంగా అవగాహన సదస్సు

లోతుకుంట కేజీబీవీలో అంబేద్కర్ జయంతి సందర్భంగా అవగాహన సదస్సు

లోతుకుంట కేజీబీవీలో అంబేద్కర్ జయంతి సందర్భంగా అవగాహన సదస్సు
14-04-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వలిగొండ మండల పరిధిలోని లోతుకుంట గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని రామన్నపేట మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ డి. సత్తయ్య ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ ఆశయాలు, రాజ్యాంగ విలువలు, సమానత్వం మరియు న్యాయం సాధనపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకొని తమ హక్కులు, బాధ్యతలను తెలుసుకోవడం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు.

ప్యానెల్ అడ్వకేట్ బి. డేవిడ్ మాట్లాడుతూ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా అందిస్తున్న ఉచిత న్యాయ సహాయం, మహిళల హక్కులు, బాలికల రక్షణకు సంబంధించిన చట్టాలపై వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థినులు చట్టాలపై స్పష్టమైన అవగాహన పొందడంతో పాటు బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో కేజీబీవీ సిబ్బంది జ్యోతి, మాధవి, అనుష, శైలజ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

లోతుకుంట కేజీబీవీలో అంబేద్కర్ జయంతి సందర్భంగా అవగాహన సదస్సు

Article Image

వలిగొండ మండల పరిధిలోని లోతుకుంట గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని రామన్నపేట మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ డి. సత్తయ్య ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ ఆశయాలు, రాజ్యాంగ విలువలు, సమానత్వం మరియు న్యాయం సాధనపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకొని తమ హక్కులు, బాధ్యతలను తెలుసుకోవడం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు.

ప్యానెల్ అడ్వకేట్ బి. డేవిడ్ మాట్లాడుతూ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా అందిస్తున్న ఉచిత న్యాయ సహాయం, మహిళల హక్కులు, బాలికల రక్షణకు సంబంధించిన చట్టాలపై వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థినులు చట్టాలపై స్పష్టమైన అవగాహన పొందడంతో పాటు బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో కేజీబీవీ సిబ్బంది జ్యోతి, మాధవి, అనుష, శైలజ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News