లోతుకుంట కేజీబీవీలో అంబేద్కర్ జయంతి సందర్భంగా అవగాహన సదస్సు
లోతుకుంట కేజీబీవీలో అంబేద్కర్ జయంతి సందర్భంగా అవగాహన సదస్సు
Editor Desk
వలిగొండ మండల పరిధిలోని లోతుకుంట గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని రామన్నపేట మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ డి. సత్తయ్య ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ ఆశయాలు, రాజ్యాంగ విలువలు, సమానత్వం మరియు న్యాయం సాధనపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకొని తమ హక్కులు, బాధ్యతలను తెలుసుకోవడం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు.
ప్యానెల్ అడ్వకేట్ బి. డేవిడ్ మాట్లాడుతూ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా అందిస్తున్న ఉచిత న్యాయ సహాయం, మహిళల హక్కులు, బాలికల రక్షణకు సంబంధించిన చట్టాలపై వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థినులు చట్టాలపై స్పష్టమైన అవగాహన పొందడంతో పాటు బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కేజీబీవీ సిబ్బంది జ్యోతి, మాధవి, అనుష, శైలజ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి