లింగపాలెంలో ఘరానా మోసం – డిపాజిట్ డబ్బులు అడిగితే దాడి!
లింగపాలెంలో ఘరానా మోసం – డిపాజిట్ డబ్బులు అడిగితే దాడి!
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జిల్లా, చింతలపూడి నియోజకవర్గం, లింగపాలెం మండలం:
మండలంలోని తోచిలక రాయుడుపాలెం గ్రామానికి చెందిన రెడ్డి వెంకటేశ్వరరావు (రాజు) కుటుంబానికి భారీ మోసం జరిగిందని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఆయన సోదరి, చింతలపూడి గ్రామానికి చెందిన పెద్దపులి లక్ష్మీ తెలిపిన వివరాల ప్రకారం… లింగపాలెం గ్రామంలో ఉన్న “శ్రీ సాయిరాం ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్” ప్రొప్రైటర్ బేతిన నాగ వెంకట మధుకు తమ కుటుంబం కొన్ని సంవత్సరాల క్రితం వ్యాపార అభివృద్ధి కోసం లక్షల రూపాయలు డిపాజిట్గా ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ఇటీవల కుటుంబ ఆర్థిక అవసరాల నేపథ్యంలో తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని పలుమార్లు అడిగినా, ఎలాంటి స్పందన రాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పైగా డబ్బులు అడిగినందుకు దుర్భాషలాడటమే కాకుండా, మహిళలను కూడా చూడకుండా అవమానకరంగా ప్రవర్తించి, శారీరకంగా దాడి చేసినట్లు ఆరోపించారు.
“నీకు దిక్కున కాడ చెప్పుకో” అంటూ బెదిరిస్తూ బయటకు నెట్టివేసి, తమపై దాడి చేశారని బాధితులు తెలిపారు. ఈ ఘటనపై లింగపాలెం మండల కాపు సంఘం పెద్దలను ఆశ్రయించినట్లు చెప్పారు.
ఈ విషయంపై కాపు సంఘం నాయకులు తీవ్రంగా స్పందించారు.
“కష్టపడి సంపాదించిన డబ్బులు డిపాజిట్గా ఇచ్చిన బాధితులు తిరిగి అడిగితే, మహిళలపై దాడి చేయడం దారుణం. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే సరైన చర్యలు తీసుకోకపోతే మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పోరాటం చేస్తాం” అని హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి