Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లలో మౌలిక వసతులు త్వరగా పూర్తి చేయండి: అదనపు కలెక్టర్ “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” జోరుమీద ఆర్‌సీబీ, రాజస్థాన్‌..!! పంజాబ్‌ 'టాప్‌' షో! కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 08, 2026 09:06 PM

లింగ నిర్ధారణ నిషేధంపై కఠిన చర్యలు: PC&PNDT సమీక్ష సమావేశం

లింగ నిర్ధారణ నిషేధంపై కఠిన చర్యలు: PC&PNDT సమీక్ష సమావేశం

లింగ నిర్ధారణ నిషేధంపై కఠిన చర్యలు: PC&PNDT సమీక్ష సమావేశం
April 08, 2026 06:53 PM 16 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రీ–కన్సెప్షన్ & ప్రీ–నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ చట్టం–1994 (PC&PNDT Act) అమలుపై జిల్లా స్థాయి సలహా కమిటీ (DLAC) సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. ఎం. మనోహర్ అధ్యక్షతన బుధవారం కలెక్టరేట్ మినీ హాల్, రాయగిరిలో ఈ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లాలో చట్టపరమైన నిబంధనల అమలు, ఆరోగ్య సంస్థల పనితీరు, రికార్డుల నిర్వహణ, సేవల నాణ్యతపై విస్తృతంగా చర్చించి సమీక్షించారు. అల్ట్రాసౌండ్ కేంద్రాలు, జన్యు పరీక్ష కేంద్రాల నమోదు, పునరుద్ధరణ, వార్షిక తనిఖీలు, చట్ట ఉల్లంఘనలపై తీసుకున్న చర్యలు, పెండింగ్ అంశాలపై సమగ్రంగా పరిశీలించారు.

అన్ని నమోదిత కేంద్రాలు చట్ట నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా లింగ నిర్ధారణ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని, ఎటువంటి ఉల్లంఘనలు జరగకుండా క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో PC&PNDT ప్రోగ్రాం అధికారి డా. యల్. యశోద, డా. ఇందిరామణి (గైనకాలజీ విభాగాధిపతి), డా. జ్యోతి, డా. శ్రీదేవి, డా. నిర్మల (పిల్లల వైద్య నిపుణులు), డా. సుమన్ కళ్యాణ్ (డిప్యూటీ DM&HO), జిల్లా పబ్లిక్ రిలేషన్స్ అధికారి అరుంధతి, డా. ప్రమీల (సఖి NGO), శివలింగం (యాత్ర NGO), నాగరాజు (స్కీడ్ NGO), చి. సాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News