PRINT TIME: May 27, 2026 01:10 AM
లెక్కలు చూపాలంటూ సర్పంచ్, అధికారుల నిర్బంధం
లెక్కలు చూపాలంటూ సర్పంచ్, అధికారుల నిర్బంధం
April 01, 2026 06:18 AM
172 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నల్లగొండ: కట్టంగూరు మండలం చెరువు అన్నారం గ్రామపంచాయతీ కార్యాలయంలో మహిళా సంఘ సభ్యులు సర్పంచ్, ఏపీఎం, సీసీలను తాళం వేసి నిర్బంధించారు.
ఐకేపీ శ్రీనిధి నిధుల్లో అవినీతి జరిగిందని, రూ.40-50 లక్షల వరకు లెక్కలు చూపడం లేదని మహిళలు ఆరోపించారు. ఏడాది కాలంగా కలెక్టర్కు పలు పిటిషన్లు ఇచ్చినా స్పందన లేదని వాపోయారు.
వారం రోజులుగా అధికారులు వస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నారని, లెక్కలు చూపించాలంటూ మహిళలు ఆందోళనకు దిగారు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. సమస్య పరిష్కారం అయ్యేంతవరకు వెనక్కి తగ్గేది లేదని మహిళలు స్పష్టం చేశారు.
ఏపీవో రామ్మోహన్ ఏప్రిల్ 7న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో పరిస్థితి శాంతించింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి