Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కలు చూపాలంటూ సర్పంచ్‌, అధికారుల నిర్బంధం చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “కల్తీకి చెక్… రాష్ట్రంలో కొత్త నియంత్రణ యంత్రాంగం” “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” ఇరాన్‌పై యుద్ధం ఆపాలి: హైదరాబాద్‌లో వామపక్షాల భారీ యుద్ధవ్యతిరేక ర్యాలీ అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 01, 2026 08:12 AM

లెక్కలు చూపాలంటూ సర్పంచ్‌, అధికారుల నిర్బంధం

లెక్కలు చూపాలంటూ సర్పంచ్‌, అధికారుల నిర్బంధం

లెక్కలు చూపాలంటూ సర్పంచ్‌, అధికారుల నిర్బంధం
April 01, 2026 06:18 AM 74 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ: కట్టంగూరు మండలం చెరువు అన్నారం గ్రామపంచాయతీ కార్యాలయంలో మహిళా సంఘ సభ్యులు సర్పంచ్‌, ఏపీఎం, సీసీలను తాళం వేసి నిర్బంధించారు.

ఐకేపీ శ్రీనిధి నిధుల్లో అవినీతి జరిగిందని, రూ.40-50 లక్షల వరకు లెక్కలు చూపడం లేదని మహిళలు ఆరోపించారు. ఏడాది కాలంగా కలెక్టర్‌కు పలు పిటిషన్లు ఇచ్చినా స్పందన లేదని వాపోయారు.

వారం రోజులుగా అధికారులు వస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నారని, లెక్కలు చూపించాలంటూ మహిళలు ఆందోళనకు దిగారు.

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. సమస్య పరిష్కారం అయ్యేంతవరకు వెనక్కి తగ్గేది లేదని మహిళలు స్పష్టం చేశారు.

ఏపీవో రామ్మోహన్ ఏప్రిల్ 7న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో పరిస్థితి శాంతించింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News