Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నకిరేకల్‌కు ఆదివారం మంత్రి కోమటిరెడ్డి రైల్వే ఫ్లైఓవర్‌కు శంకుస్థాపన.. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:05 PM

లెక్కలు చూపాలంటూ సర్పంచ్‌, అధికారుల నిర్బంధం

లెక్కలు చూపాలంటూ సర్పంచ్‌, అధికారుల నిర్బంధం

లెక్కలు చూపాలంటూ సర్పంచ్‌, అధికారుల నిర్బంధం
April 01, 2026 06:18 AM 175 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ: కట్టంగూరు మండలం చెరువు అన్నారం గ్రామపంచాయతీ కార్యాలయంలో మహిళా సంఘ సభ్యులు సర్పంచ్‌, ఏపీఎం, సీసీలను తాళం వేసి నిర్బంధించారు.

ఐకేపీ శ్రీనిధి నిధుల్లో అవినీతి జరిగిందని, రూ.40-50 లక్షల వరకు లెక్కలు చూపడం లేదని మహిళలు ఆరోపించారు. ఏడాది కాలంగా కలెక్టర్‌కు పలు పిటిషన్లు ఇచ్చినా స్పందన లేదని వాపోయారు.

వారం రోజులుగా అధికారులు వస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నారని, లెక్కలు చూపించాలంటూ మహిళలు ఆందోళనకు దిగారు.

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. సమస్య పరిష్కారం అయ్యేంతవరకు వెనక్కి తగ్గేది లేదని మహిళలు స్పష్టం చేశారు.

ఏపీవో రామ్మోహన్ ఏప్రిల్ 7న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో పరిస్థితి శాంతించింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News