కరీంనగర్: బైపాస్ రోడ్డుపై ఆర్టీసీ అద్దె బస్సు లారీని ఢీకొన్న ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో కొత్త డ్రైవర్లతో బస్సులు నడుపుతుండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కండక్టర్ లేకపోవడంతో డ్రైవర్ టికెట్లు ఇస్తూ వాహనం నడపడం ప్రమాదానికి కారణమైందని తెలుస్తోంది.
ఈ ఘటనపై ప్రయాణికుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం సరైన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడకూడదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి