లోక్ అదాలత్తో సత్వర న్యాయం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్..
లోక్ అదాలత్తో సత్వర న్యాయం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్..
NM Yadav
నల్లగొండ జిల్లావ్యాప్తంగా 7,624 కేసుల పరిష్కారం..
నల్లగొండ : ప్రజలకు త్వరితగతిన మరియు ఖర్చులేని న్యాయాన్ని అందించడమే లక్ష్యంగా జిల్లావ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ విజయవంతమైందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయశాఖ, పోలీస్ శాఖ మరియు ఇతర సంబంధిత విభాగాల సమన్వయంతో శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో రికార్డు స్థాయిలో కేసులు పరిష్కారమైనట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లావ్యాప్తంగా మొత్తం 7,624 కేసులు కొలిక్కి వచ్చాయని, ఇందులో 4,182 డీడీ కేసులు, 2,512 ఈ-పెట్టీ కేసులు, 886 ఐపీసీ కేసులు మరియు 44 ఎస్ఎల్ఎల్ కేసులు ఉన్నాయని వివరించారు.
కోర్టుల్లో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న చిన్నచిన్న కేసులను పరస్పర అవగాహనతో చట్టబద్ధంగా పరిష్కరించుకోవడం వల్ల న్యాయవ్యవస్థపై భారం తగ్గడమే కాకుండా కక్షిదారుల సమయం మరియు ధనం ఆదా అవుతాయని ఎస్పీ అభిప్రాయపడ్డారు. జాతీయ లోక్ అదాలత్ వంటి కార్యక్రమాలు సామాన్య ప్రజలకు ఎంతో కీలకమని దీర్ఘకాలిక న్యాయ ప్రక్రియల నుంచి విముక్తి పొందేందుకు ఇదొక చక్కని అవకాశమని ఆయన అన్నారు. భవిష్యత్తులో నిర్వహించే లోక్ అదాలత్ కార్యక్రమాల్లో కూడా ప్రజలు చురుకుగా పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.ఈ భారీ స్థాయిలో కేసుల పరిష్కారం సాధ్యం కావడానికి కృషి చేసిన జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బంది, న్యాయమూర్తులు, న్యాయవాదులు మరియు ఇతర శాఖల ప్రతినిధులను ఎస్పీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. అందరి సమన్వయంతోనే ఇంతటి విశేష ఫలితాలు సాధించగలిగామని ఆయన కొనియాడారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి