కుటుంబానికి అండగా సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ రూ.10 వేల తక్షణ ఆర్థిక సహాయం
కుటుంబానికి అండగా సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ రూ.10 వేల తక్షణ ఆర్థిక సహాయం
Editor Desk
రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన శివగల్ల జ్ఞానేశ్వర్ అనారోగ్యంతో అకాల మరణం చెందడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ మృతుడి భౌతిక దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రూ.10,000 (పదివేల రూపాయలు) తక్షణ ఆర్థిక సహాయం అందజేసి, భవిష్యత్తులో కూడా అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డు సభ్యులు పుట్టల లక్ష్మమ్మ, ముత్యాలు, వరికుప్పల స్వామి, అలాగే మందడి విద్యాసాగర్ రెడ్డి, ఈర్లపల్లి మల్లయ్య, కాటపల్లి యాదయ్య, మంటి లింగస్వామి, రవ్వ నర్సింహా, సింగణబోయిన జంగయ్య, మంటి రమేష్, నిమ్మగడ్డ పద్మారావ్, కంబాలపల్లి శ్రీశైలం, నల్ల రామస్వామి, రాధారపు మల్లేశం, గర్ధాస్ వెంకటేష్, గోళ్లేపల్లి యాదయ్య, ఈర్లపల్లి రమేష్, చిన్నపాక సురేష్, జిట్టబోయిన వెంకటేష్, బోనగిరి సంజీవ, కొమ్మగోని సంజీవ, సింగణబోయిన మల్లేష్, కాటపల్లి మహేష్, నల్ల భాస్కర్, బొల్ల నర్సింహా, బొల్ల మచ్చి, నీరుడు వెంకటేష్, గునిగంటి రామలింగం, మంటి బిక్షపతి, కొంగరి నర్సింహా, మాధం నగేష్, నీరుడు నరేష్, గర్ధాస్ శ్రీకాంత్, గర్ధాస్ సాయి, మండల కృష్ణ, మంటి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి