యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన దోర్నాల రాములు అకాల మృతిచెందగా, ఆయన అంత్యక్రియలు హృదయ విదారక వాతావరణంలో జరిగాయి.
రాములకు నలుగురు కూతుళ్లు ఉండగా, పెద్ద కూతురు రమాదేవి సంప్రదాయాలను అధిగమిస్తూ తండ్రికి తలకొరివి పెట్టి అందరినీ కంటతడి పెట్టించింది. ఆమెతో పాటు రెండవ కూతురు రజిని, మూడవ కూతురు విజయ, నాలుగవ కూతురు కల్పన తండ్రి మరణంతో విషాదంలో మునిగిపోయారు.
కూతురు తలకొరివి పెట్టిన ఈ ఘటన గ్రామంలో భావోద్వేగాన్ని రేకెత్తించింది. “కంటే కూతుర్నే కనాలి” అనే మాటను గుర్తు చేస్తూ పలువురిని ఆలోచింపజేసింది.
ఈ దహన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి