Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెద్దకాపర్తిలో రైతులకు CRIDA శాస్త్రవేత్తల అవగాహన 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 03:16 PM

కురువ–కురుమల అభ్యున్నతికి కృషి చేస్తాం – దేవేంద్రప్ప

కురువ–కురుమల అభ్యున్నతికి కృషి చేస్తాం – దేవేంద్రప్ప

కురువ–కురుమల అభ్యున్నతికి కృషి చేస్తాం – దేవేంద్రప్ప
April 14, 2026 06:31 PM 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కురుబ సంఘం నూతనంగా ఎన్నికైన నాయకుల సన్మాన సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న కురుమ, కురుబ, కురువల అభివృద్ధి కోసం తాను కృషి చేస్తానని తెలిపారు. ఆర్థిక, విద్యా, రాజకీయ రంగాల్లో కురుబలు ఎదిగినప్పుడే అన్ని రంగాల్లో రాణించగలరని పేర్కొన్నారు. కుల సంఘాలు ఐక్యంగా ఉంటూ ముందుకు సాగితే రాజకీయంగా ఎదగడం సులభమవుతుందని అన్నారు.

కార్యక్రమానికి హాజరైన స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ భాష మాట్లాడుతూ మదనపల్లెలో తన గెలుపుకు సహకరించిన కురుబలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కురుబలకు ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

అంతకుముందు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

దేవేంద్రప్ప మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కురుబలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. కురుబలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, రాబోయే ఎన్నికల్లో కురుబలు ఐక్యంగా కలిసి కట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే నారా లోకేష్ తమకు మద్దతుగా నిలుస్తున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కురుబ సంఘం నాయకులు గౌని లక్ష్మన్న, కాంతారావు, రఘునాథ్, కప్పల శ్రీరాములు, సదాశివ, గూడే శ్రీనివాసులు, ఆవుల కిష్టయ్య, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News