Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రోన్‌తో జెండా ఎగరవేసిన జెట్టి శివప్రసాద్ వివేకానంద పాఠశాల 10వ వార్షికోత్సవం ఘనంగా అలరించిన చిన్నారుల నృత్యాలు – గురువులే విద్యార్థుల భవితకు మార్గదర్శకులు అంబేడ్కర్: పుస్తకాలలో కాదు, ప్రస్తుత సమాజంలో పునర్జన్మ పొందాల్సిన ఆలోచన” హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 14, 2026 10:16 PM

కురువ–కురుమల అభ్యున్నతికి కృషి చేస్తాం – దేవేంద్రప్ప

కురువ–కురుమల అభ్యున్నతికి కృషి చేస్తాం – దేవేంద్రప్ప

కురువ–కురుమల అభ్యున్నతికి కృషి చేస్తాం – దేవేంద్రప్ప
April 14, 2026 06:31 PM 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కురుబ సంఘం నూతనంగా ఎన్నికైన నాయకుల సన్మాన సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న కురుమ, కురుబ, కురువల అభివృద్ధి కోసం తాను కృషి చేస్తానని తెలిపారు. ఆర్థిక, విద్యా, రాజకీయ రంగాల్లో కురుబలు ఎదిగినప్పుడే అన్ని రంగాల్లో రాణించగలరని పేర్కొన్నారు. కుల సంఘాలు ఐక్యంగా ఉంటూ ముందుకు సాగితే రాజకీయంగా ఎదగడం సులభమవుతుందని అన్నారు.

కార్యక్రమానికి హాజరైన స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ భాష మాట్లాడుతూ మదనపల్లెలో తన గెలుపుకు సహకరించిన కురుబలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కురుబలకు ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

అంతకుముందు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

దేవేంద్రప్ప మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కురుబలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. కురుబలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, రాబోయే ఎన్నికల్లో కురుబలు ఐక్యంగా కలిసి కట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే నారా లోకేష్ తమకు మద్దతుగా నిలుస్తున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కురుబ సంఘం నాయకులు గౌని లక్ష్మన్న, కాంతారావు, రఘునాథ్, కప్పల శ్రీరాములు, సదాశివ, గూడే శ్రీనివాసులు, ఆవుల కిష్టయ్య, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News