Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సీటుంది.. సార్ లేరు.. ‘చౌటుప్పల్’ విద్యాశాఖ తీరిది! 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 08:45 PM

కుమ్మరుల సర్వసభ్య సమావేశం మోటకొండూరులో కమిటీలు ఏకగ్రీవం

కుమ్మరుల సర్వసభ్య సమావేశం మోటకొండూరులో కమిటీలు ఏకగ్రీవం

కుమ్మరుల సర్వసభ్య సమావేశం మోటకొండూరులో కమిటీలు ఏకగ్రీవం
April 27, 2026 08:45 AM 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా కుమ్మర సంఘం ఆధ్వర్యంలో మోటకొండూరు మండలం 20 గ్రామాల సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. రాష్ట్ర కుమ్మర సంఘం నాయకత్వంలో నిర్వహించిన ఈ సమావేశంలో మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

మండల అధ్యక్షుడిగా కోరుటూరు మధు, ప్రధాన కార్యదర్శిగా పచ్చాపురం ఉప్పలయ్య, ఖజాంచీగా శనిగారం పరశురామ్, గౌరవాధ్యక్షుడిగా జివిలీకపల్లి నరసింహ, ఉపాధ్యక్షులుగా కానుగుల వెంకటేష్, శనిగారం పుల్లయ్య, యువత విభాగం అధ్యక్షుడిగా శనిగారం ప్రదీప్ ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి దరిపల్లి ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ… త్వరలో జిల్లాలో కుమ్మరుల మహా బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. కుమ్మరుల అభివృద్ధే లక్ష్యమని పేర్కొంటూ పలు డిమాండ్లు వెల్లడించారు.

కుమ్మరులను బీసీ-బీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలని, గ్రామ దేవతల ఆలయాల్లో పూజారులుగా పనిచేస్తున్న వారికి నెలకు రూ.10 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వృత్తి పనిముట్లు అందజేయాలని, 55 సంవత్సరాలు పైబడిన వారికి రూ.6 వేల పెన్షన్ కల్పించాలని కోరారు. చిన్న పరిశ్రమల ఏర్పాటు కోసం మూడు ఎకరాల భూమితో పాటు రూ.2 లక్షల రుణం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

రాబోయే మహాసభకు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు, వృత్తిదారుల ప్రతినిధులు, మండలంలోని 20 గ్రామాల ప్రతినిధులు, కుమ్మరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News