కుమ్మరుల సర్వసభ్య సమావేశం మోటకొండూరులో కమిటీలు ఏకగ్రీవం
కుమ్మరుల సర్వసభ్య సమావేశం మోటకొండూరులో కమిటీలు ఏకగ్రీవం
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లా కుమ్మర సంఘం ఆధ్వర్యంలో మోటకొండూరు మండలం 20 గ్రామాల సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. రాష్ట్ర కుమ్మర సంఘం నాయకత్వంలో నిర్వహించిన ఈ సమావేశంలో మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
మండల అధ్యక్షుడిగా కోరుటూరు మధు, ప్రధాన కార్యదర్శిగా పచ్చాపురం ఉప్పలయ్య, ఖజాంచీగా శనిగారం పరశురామ్, గౌరవాధ్యక్షుడిగా జివిలీకపల్లి నరసింహ, ఉపాధ్యక్షులుగా కానుగుల వెంకటేష్, శనిగారం పుల్లయ్య, యువత విభాగం అధ్యక్షుడిగా శనిగారం ప్రదీప్ ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి దరిపల్లి ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ… త్వరలో జిల్లాలో కుమ్మరుల మహా బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. కుమ్మరుల అభివృద్ధే లక్ష్యమని పేర్కొంటూ పలు డిమాండ్లు వెల్లడించారు.
కుమ్మరులను బీసీ-బీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలని, గ్రామ దేవతల ఆలయాల్లో పూజారులుగా పనిచేస్తున్న వారికి నెలకు రూ.10 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వృత్తి పనిముట్లు అందజేయాలని, 55 సంవత్సరాలు పైబడిన వారికి రూ.6 వేల పెన్షన్ కల్పించాలని కోరారు. చిన్న పరిశ్రమల ఏర్పాటు కోసం మూడు ఎకరాల భూమితో పాటు రూ.2 లక్షల రుణం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
రాబోయే మహాసభకు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు, వృత్తిదారుల ప్రతినిధులు, మండలంలోని 20 గ్రామాల ప్రతినిధులు, కుమ్మరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి