Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కుంకుడు పాములలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎస్సై చైతన్య చందర్ పై వేటు పడింది వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం నూతన పాల్గొన్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి సామకోటి పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 27, 2026 10:41 AM

కుమ్మరుల సర్వసభ్య సమావేశం మోటకొండూరులో కమిటీలు ఏకగ్రీవం

కుమ్మరుల సర్వసభ్య సమావేశం మోటకొండూరులో కమిటీలు ఏకగ్రీవం

కుమ్మరుల సర్వసభ్య సమావేశం మోటకొండూరులో కమిటీలు ఏకగ్రీవం
April 27, 2026 08:45 AM 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా కుమ్మర సంఘం ఆధ్వర్యంలో మోటకొండూరు మండలం 20 గ్రామాల సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. రాష్ట్ర కుమ్మర సంఘం నాయకత్వంలో నిర్వహించిన ఈ సమావేశంలో మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

మండల అధ్యక్షుడిగా కోరుటూరు మధు, ప్రధాన కార్యదర్శిగా పచ్చాపురం ఉప్పలయ్య, ఖజాంచీగా శనిగారం పరశురామ్, గౌరవాధ్యక్షుడిగా జివిలీకపల్లి నరసింహ, ఉపాధ్యక్షులుగా కానుగుల వెంకటేష్, శనిగారం పుల్లయ్య, యువత విభాగం అధ్యక్షుడిగా శనిగారం ప్రదీప్ ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి దరిపల్లి ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ… త్వరలో జిల్లాలో కుమ్మరుల మహా బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. కుమ్మరుల అభివృద్ధే లక్ష్యమని పేర్కొంటూ పలు డిమాండ్లు వెల్లడించారు.

కుమ్మరులను బీసీ-బీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలని, గ్రామ దేవతల ఆలయాల్లో పూజారులుగా పనిచేస్తున్న వారికి నెలకు రూ.10 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వృత్తి పనిముట్లు అందజేయాలని, 55 సంవత్సరాలు పైబడిన వారికి రూ.6 వేల పెన్షన్ కల్పించాలని కోరారు. చిన్న పరిశ్రమల ఏర్పాటు కోసం మూడు ఎకరాల భూమితో పాటు రూ.2 లక్షల రుణం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

రాబోయే మహాసభకు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు, వృత్తిదారుల ప్రతినిధులు, మండలంలోని 20 గ్రామాల ప్రతినిధులు, కుమ్మరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News