Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ బడుల వైపు అడుగులు.. బడిబాటకు మంచి స్పందన ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 17, 2026 02:33 PM

కుమ్మరవాండ్లపల్లి పేలుళ్లు: మృతులకు పరిహారం – గాయపడిన వారికి మెరుగైన వైద్యం కల్పించాలి – బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోరంట్ల మోహన్ శేఖర్

కుమ్మరవాండ్లపల్లి పేలుళ్లు: మృతులకు పరిహారం – గాయపడిన వారికి మెరుగైన వైద్యం కల్పించాలి – బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోరంట్ల మోహన్ శేఖర్

కుమ్మరవాండ్లపల్లి పేలుళ్లు: మృతులకు పరిహారం – గాయపడిన వారికి మెరుగైన వైద్యం కల్పించాలి – బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోరంట్ల మోహన్ శేఖర్
April 15, 2026 04:31 PM 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

కదిరి, : సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుళ్ల ఘటనపై బీజేపీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు గోరంట్ల మోహన్ శేఖర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు తగిన ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నట్లుగా జిల్లెటిన్ స్టిక్స్ ఉన్నాయనే వార్తలు నిజమైతే, పేలుడు పదార్థాలను నిల్వ చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ఈ విషయంలో అసాంఘిక శక్తుల ప్రమేయం ఉన్నట్లయితే, ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ ఘటన పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుని ప్రజల భద్రతను కాపాడాలని ఆయన సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News