Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భవన నిర్మాణ కార్మిక సంక్షేమ పథకాలు బోర్డు ద్వారానే అమలు చేయాలి 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 05:52 PM

కుమ్మరవాండ్లపల్లి పేలుళ్లు: మృతులకు పరిహారం – గాయపడిన వారికి మెరుగైన వైద్యం కల్పించాలి – బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోరంట్ల మోహన్ శేఖర్

కుమ్మరవాండ్లపల్లి పేలుళ్లు: మృతులకు పరిహారం – గాయపడిన వారికి మెరుగైన వైద్యం కల్పించాలి – బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోరంట్ల మోహన్ శేఖర్

కుమ్మరవాండ్లపల్లి పేలుళ్లు: మృతులకు పరిహారం – గాయపడిన వారికి మెరుగైన వైద్యం కల్పించాలి – బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోరంట్ల మోహన్ శేఖర్
April 15, 2026 04:31 PM 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

కదిరి, : సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుళ్ల ఘటనపై బీజేపీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు గోరంట్ల మోహన్ శేఖర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు తగిన ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నట్లుగా జిల్లెటిన్ స్టిక్స్ ఉన్నాయనే వార్తలు నిజమైతే, పేలుడు పదార్థాలను నిల్వ చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ఈ విషయంలో అసాంఘిక శక్తుల ప్రమేయం ఉన్నట్లయితే, ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ ఘటన పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుని ప్రజల భద్రతను కాపాడాలని ఆయన సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News