Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 05:37 AM

కుమ్మరవాండ్లపల్లి పేలుళ్లు: మృతులకు పరిహారం – గాయపడిన వారికి మెరుగైన వైద్యం కల్పించాలి – బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోరంట్ల మోహన్ శేఖర్

కుమ్మరవాండ్లపల్లి పేలుళ్లు: మృతులకు పరిహారం – గాయపడిన వారికి మెరుగైన వైద్యం కల్పించాలి – బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోరంట్ల మోహన్ శేఖర్

కుమ్మరవాండ్లపల్లి పేలుళ్లు: మృతులకు పరిహారం – గాయపడిన వారికి మెరుగైన వైద్యం కల్పించాలి – బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోరంట్ల మోహన్ శేఖర్
15-04-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

కదిరి, : సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుళ్ల ఘటనపై బీజేపీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు గోరంట్ల మోహన్ శేఖర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు తగిన ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నట్లుగా జిల్లెటిన్ స్టిక్స్ ఉన్నాయనే వార్తలు నిజమైతే, పేలుడు పదార్థాలను నిల్వ చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ఈ విషయంలో అసాంఘిక శక్తుల ప్రమేయం ఉన్నట్లయితే, ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ ఘటన పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుని ప్రజల భద్రతను కాపాడాలని ఆయన సూచించారు.

Sthanikam

కుమ్మరవాండ్లపల్లి పేలుళ్లు: మృతులకు పరిహారం – గాయపడిన వారికి మెరుగైన వైద్యం కల్పించాలి – బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోరంట్ల మోహన్ శేఖర్

Article Image

కదిరి, : సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుళ్ల ఘటనపై బీజేపీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు గోరంట్ల మోహన్ శేఖర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు తగిన ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నట్లుగా జిల్లెటిన్ స్టిక్స్ ఉన్నాయనే వార్తలు నిజమైతే, పేలుడు పదార్థాలను నిల్వ చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ఈ విషయంలో అసాంఘిక శక్తుల ప్రమేయం ఉన్నట్లయితే, ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ ఘటన పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుని ప్రజల భద్రతను కాపాడాలని ఆయన సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News