కుమ్మరవాండ్లపల్లి పేలుళ్లు: మృతులకు పరిహారం – గాయపడిన వారికి మెరుగైన వైద్యం కల్పించాలి – బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోరంట్ల మోహన్ శేఖర్
కుమ్మరవాండ్లపల్లి పేలుళ్లు: మృతులకు పరిహారం – గాయపడిన వారికి మెరుగైన వైద్యం కల్పించాలి – బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోరంట్ల మోహన్ శేఖర్
Prakash
కదిరి, : సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుళ్ల ఘటనపై బీజేపీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు గోరంట్ల మోహన్ శేఖర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు తగిన ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నట్లుగా జిల్లెటిన్ స్టిక్స్ ఉన్నాయనే వార్తలు నిజమైతే, పేలుడు పదార్థాలను నిల్వ చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ఈ విషయంలో అసాంఘిక శక్తుల ప్రమేయం ఉన్నట్లయితే, ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ ఘటన పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుని ప్రజల భద్రతను కాపాడాలని ఆయన సూచించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి