Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 06:15 AM

కూలి కార్మికుడు ఉప్పయ్య మృతి.. కుటుంబానికి సాయం చేయాలని విజ్ఞప్తి

కూలి కార్మికుడు ఉప్పయ్య మృతి.. కుటుంబానికి సాయం చేయాలని విజ్ఞప్తి

కూలి కార్మికుడు ఉప్పయ్య మృతి.. కుటుంబానికి సాయం చేయాలని విజ్ఞప్తి
March 09, 2026 03:48 PM 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఖమ్మం: జిల్లాలోని కూసుమంచి మండలం చేగోమ్మ గ్రామ దళిత కాలనీకి చెందిన కిన్నెర ఉప్పయ్య (55) అనారోగ్యంతో మృతి చెందారు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం గత ఆరు నెలలుగా సుగర్, బీపీ సమస్యలతో పాటు రెండు కిడ్నీలు దెబ్బతినడంతో చికిత్స పొందుతూ వచ్చారు. అయితే ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు.

ఉప్పయ్య కూలి పనులపై ఆధారపడి కుటుంబాన్ని పోషించేవారని గ్రామస్తులు తెలిపారు. ఆయనకు భార్యతో పాటు ముగ్గురు సంతానం ఉన్నారు. ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, వారిలో చిన్న కుమార్తె అనారోగ్యంతో బాధపడుతోందని తెలిపారు. కుటుంబం పూర్తిగా కూలి పనులపై ఆధారపడుతూ ఉండటంతో ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

ఈ నేపథ్యంలో ఉప్పయ్య కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు, నాయకులు కోరారు. సోమవారం ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో Communist Party of India (Marxist) కూసుమంచి మండల కార్యదర్శి వర్గ సభ్యుడు తాళ్లూరి వెంకటేశ్వరరావు, చేగోమ్మ గ్రామ శాఖ కార్యదర్శి ఉన్నం బాబు, సభ్యులు నర్రా వెంకన్న, CPI (ML) New Democracy నాయకుడు మాతంగి రామస్వామి తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News