కూలి కార్మికుడు ఉప్పయ్య మృతి.. కుటుంబానికి సాయం చేయాలని విజ్ఞప్తి
కూలి కార్మికుడు ఉప్పయ్య మృతి.. కుటుంబానికి సాయం చేయాలని విజ్ఞప్తి
Editor Desk
ఖమ్మం: జిల్లాలోని కూసుమంచి మండలం చేగోమ్మ గ్రామ దళిత కాలనీకి చెందిన కిన్నెర ఉప్పయ్య (55) అనారోగ్యంతో మృతి చెందారు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం గత ఆరు నెలలుగా సుగర్, బీపీ సమస్యలతో పాటు రెండు కిడ్నీలు దెబ్బతినడంతో చికిత్స పొందుతూ వచ్చారు. అయితే ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు.
ఉప్పయ్య కూలి పనులపై ఆధారపడి కుటుంబాన్ని పోషించేవారని గ్రామస్తులు తెలిపారు. ఆయనకు భార్యతో పాటు ముగ్గురు సంతానం ఉన్నారు. ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, వారిలో చిన్న కుమార్తె అనారోగ్యంతో బాధపడుతోందని తెలిపారు. కుటుంబం పూర్తిగా కూలి పనులపై ఆధారపడుతూ ఉండటంతో ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
ఈ నేపథ్యంలో ఉప్పయ్య కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు, నాయకులు కోరారు. సోమవారం ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో Communist Party of India (Marxist) కూసుమంచి మండల కార్యదర్శి వర్గ సభ్యుడు తాళ్లూరి వెంకటేశ్వరరావు, చేగోమ్మ గ్రామ శాఖ కార్యదర్శి ఉన్నం బాబు, సభ్యులు నర్రా వెంకన్న, CPI (ML) New Democracy నాయకుడు మాతంగి రామస్వామి తదితరులు పాల్గొన్నారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి