Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:14 AM

కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలి: కొండమడుగు నరసింహ

కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలి: కొండమడుగు నరసింహ

కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలి: కొండమడుగు నరసింహ
25-04-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బీబీనగర్,

నిప్పులు చెరిగే ఎండలో పనిచేస్తున్న కూలీలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడంలో పాలకులు, అధికారులు విఫలమయ్యారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి Kondamadugu Narsimha విమర్శించారు.

శనివారం బీబీనగర్ ఎంపీడీవో కార్యాలయం ముందు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పని ప్రదేశాల్లో ఎన్‌ఎంఎంఎస్ యాప్ ద్వారా రోజుకు రెండుసార్లు ముఖాధారిత హాజరు నమోదు చేయడం వల్ల సాంకేతిక సమస్యలతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం Mahatma Gandhi National Rural Employment Guarantee Act అమలులో మార్పులు చేస్తూ కార్మికుల హక్కులను తగ్గిస్తోందని ఆరోపించారు. చేసిన పనికి వేతనాలు సకాలంలో అందకపోవడం, నెలల తరబడి బకాయిలు పేరుకుపోవడం వల్ల కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

ఎండల్లో పనిచేసే కార్మికులకు తాగునీరు, నీడ కోసం టెంట్లు, ప్రథమ చికిత్స కోసం మెడికల్ కిట్లు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించి రోజుకు రూ.800 కూలీ ఇవ్వాలని, పని సమయంలో గాయపడితే వైద్య ఖర్చులు ప్రభుత్వం భరించాలని, ప్రమాద బీమా సదుపాయం కల్పించాలని కోరారు.

ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఏపీఓలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు వేతన బకాయిలను వెంటనే చెల్లించి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.

అనంతరం సూపరిండెంట్ రవి శివకుమార్, ఏపీఓ కళావతికి కార్మికులతో కలిసి డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షురాలు కొలిచెలమ ప్రసన్న, మండల కార్యదర్శి గాడి శ్రీనివాస్, సీఐటీయూ మండల కన్వీనర్ బండారి శ్రావణ్, నాయకులు ఎస్‌.డి. ఉమర్, ఫీల్డ్ అసిస్టెంట్లు, మహిళా కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలి: కొండమడుగు నరసింహ

Article Image

బీబీనగర్,

నిప్పులు చెరిగే ఎండలో పనిచేస్తున్న కూలీలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడంలో పాలకులు, అధికారులు విఫలమయ్యారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి Kondamadugu Narsimha విమర్శించారు.

శనివారం బీబీనగర్ ఎంపీడీవో కార్యాలయం ముందు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పని ప్రదేశాల్లో ఎన్‌ఎంఎంఎస్ యాప్ ద్వారా రోజుకు రెండుసార్లు ముఖాధారిత హాజరు నమోదు చేయడం వల్ల సాంకేతిక సమస్యలతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం Mahatma Gandhi National Rural Employment Guarantee Act అమలులో మార్పులు చేస్తూ కార్మికుల హక్కులను తగ్గిస్తోందని ఆరోపించారు. చేసిన పనికి వేతనాలు సకాలంలో అందకపోవడం, నెలల తరబడి బకాయిలు పేరుకుపోవడం వల్ల కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

ఎండల్లో పనిచేసే కార్మికులకు తాగునీరు, నీడ కోసం టెంట్లు, ప్రథమ చికిత్స కోసం మెడికల్ కిట్లు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించి రోజుకు రూ.800 కూలీ ఇవ్వాలని, పని సమయంలో గాయపడితే వైద్య ఖర్చులు ప్రభుత్వం భరించాలని, ప్రమాద బీమా సదుపాయం కల్పించాలని కోరారు.

ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఏపీఓలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు వేతన బకాయిలను వెంటనే చెల్లించి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.

అనంతరం సూపరిండెంట్ రవి శివకుమార్, ఏపీఓ కళావతికి కార్మికులతో కలిసి డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షురాలు కొలిచెలమ ప్రసన్న, మండల కార్యదర్శి గాడి శ్రీనివాస్, సీఐటీయూ మండల కన్వీనర్ బండారి శ్రావణ్, నాయకులు ఎస్‌.డి. ఉమర్, ఫీల్డ్ అసిస్టెంట్లు, మహిళా కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News