కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలి: కొండమడుగు నరసింహ
కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలి: కొండమడుగు నరసింహ
Editor Desk
బీబీనగర్,
నిప్పులు చెరిగే ఎండలో పనిచేస్తున్న కూలీలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడంలో పాలకులు, అధికారులు విఫలమయ్యారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి Kondamadugu Narsimha విమర్శించారు.
శనివారం బీబీనగర్ ఎంపీడీవో కార్యాలయం ముందు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పని ప్రదేశాల్లో ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా రోజుకు రెండుసార్లు ముఖాధారిత హాజరు నమోదు చేయడం వల్ల సాంకేతిక సమస్యలతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం Mahatma Gandhi National Rural Employment Guarantee Act అమలులో మార్పులు చేస్తూ కార్మికుల హక్కులను తగ్గిస్తోందని ఆరోపించారు. చేసిన పనికి వేతనాలు సకాలంలో అందకపోవడం, నెలల తరబడి బకాయిలు పేరుకుపోవడం వల్ల కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ఎండల్లో పనిచేసే కార్మికులకు తాగునీరు, నీడ కోసం టెంట్లు, ప్రథమ చికిత్స కోసం మెడికల్ కిట్లు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించి రోజుకు రూ.800 కూలీ ఇవ్వాలని, పని సమయంలో గాయపడితే వైద్య ఖర్చులు ప్రభుత్వం భరించాలని, ప్రమాద బీమా సదుపాయం కల్పించాలని కోరారు.
ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఏపీఓలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు వేతన బకాయిలను వెంటనే చెల్లించి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.
అనంతరం సూపరిండెంట్ రవి శివకుమార్, ఏపీఓ కళావతికి కార్మికులతో కలిసి డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షురాలు కొలిచెలమ ప్రసన్న, మండల కార్యదర్శి గాడి శ్రీనివాస్, సీఐటీయూ మండల కన్వీనర్ బండారి శ్రావణ్, నాయకులు ఎస్.డి. ఉమర్, ఫీల్డ్ అసిస్టెంట్లు, మహిళా కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి