Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గూగుల్ పే QR కోడ్ పేరుతో కొత్త మోసం.. వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి: కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 04:25 PM

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆత్మ బలి దానాలు చేసుకోవడం కోసం కాదు.

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆత్మ బలి దానాలు చేసుకోవడం కోసం కాదు.

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆత్మ బలి దానాలు చేసుకోవడం కోసం కాదు.
April 24, 2026 10:02 PM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- బిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు గుండు ముత్తయ్య గౌడ్.

సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు తీవ్రమైన ఆందోళనతో,ఉద్వేగానికి లోనై ఆత్మహత్య ప్రయత్నాలకు వెళ్ళడం అత్యంత బాధాకరమని భువనగిరి మండల బిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు గుండు ముత్తయ్య గౌడ్ అన్నారు.తెలంగాణ అమరులు తమ పోరాటాలతో సాధించిన తెలంగాణ,తిరిగి సమస్యలతో ఆత్మ బలి దానాల కోసం కాదు.కార్మిక సోదరులారా,తెలంగాణ బిడ్డలైన మీలో ఎవరు ఇటువంటి దుఃఖానికి గురైనా,తెలంగాణ యావత్ ప్రజానీకం మొత్తం కలతతో బాధపడుతుంది.దయచేసి ఎవ్వరూ ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని చేతులెత్తి వేడుకుంటున్నాను. ఆత్మహుతి ప్రయత్నం చేసుకొన్న నర్సంపేట సోదరుడు శంకర్ గౌడ్ చికిత్స పొందుతూ మృతి చెందారు.మృతునికి గౌడ కులస్తుల తరఫున జోహార్లు తెలుపుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియ జేస్తున్నాము.ఆర్టీసీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చే వరకు వారు చేస్తున్న సమ్మెకు మద్దతుగా నిలిచి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యను పరిష్కరించి, పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత వహించాలని భువనగిరి బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు గుండు ముత్తయ్య గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News