కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆత్మ బలి దానాలు చేసుకోవడం కోసం కాదు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆత్మ బలి దానాలు చేసుకోవడం కోసం కాదు.
Sthanikam District Staff Reporter
- బిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు గుండు ముత్తయ్య గౌడ్.
సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు తీవ్రమైన ఆందోళనతో,ఉద్వేగానికి లోనై ఆత్మహత్య ప్రయత్నాలకు వెళ్ళడం అత్యంత బాధాకరమని భువనగిరి మండల బిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు గుండు ముత్తయ్య గౌడ్ అన్నారు.తెలంగాణ అమరులు తమ పోరాటాలతో సాధించిన తెలంగాణ,తిరిగి సమస్యలతో ఆత్మ బలి దానాల కోసం కాదు.కార్మిక సోదరులారా,తెలంగాణ బిడ్డలైన మీలో ఎవరు ఇటువంటి దుఃఖానికి గురైనా,తెలంగాణ యావత్ ప్రజానీకం మొత్తం కలతతో బాధపడుతుంది.దయచేసి ఎవ్వరూ ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని చేతులెత్తి వేడుకుంటున్నాను. ఆత్మహుతి ప్రయత్నం చేసుకొన్న నర్సంపేట సోదరుడు శంకర్ గౌడ్ చికిత్స పొందుతూ మృతి చెందారు.మృతునికి గౌడ కులస్తుల తరఫున జోహార్లు తెలుపుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియ జేస్తున్నాము.ఆర్టీసీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చే వరకు వారు చేస్తున్న సమ్మెకు మద్దతుగా నిలిచి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యను పరిష్కరించి, పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత వహించాలని భువనగిరి బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు గుండు ముత్తయ్య గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి