కొండపై వర్తక సంఘం రద్దు చేయాలి: బీజేపీ డిమాండ్
కొండపై వర్తక సంఘం రద్దు చేయాలి: బీజేపీ డిమాండ్
Editor Desk
యాదగిరిగుట్ట కొండపై కొనసాగుతున్న వర్తక సంఘాన్ని తక్షణం రద్దు చేయాలని బీజేపీ పట్టణ శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు దేవదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ మాట్లాడుతూ, కొండపై అనేక సంవత్సరాలుగా కొన్ని దుకాణాలను టెండర్ విధానం లేకుండా పునరుద్ధరిస్తూ (రెన్యువల్) కొనసాగిస్తున్నారని ఆరోపించారు. వివిధ రాజకీయ పార్టీల ప్రభావం, ప్రభుత్వ అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని ఈ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. దీనివల్ల భక్తులు ఇబ్బందులు పడటమే కాకుండా దేవస్థానం ఆదాయానికి నష్టం జరుగుతోందన్నారు.
ఎండోమెంట్ చట్టం ప్రకారం ఒకే దుకాణాన్ని పలు మార్లు పునరుద్ధరించడం చట్ట విరుద్ధమని, ఈ విషయంలో అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించేలా పారదర్శక టెండర్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈసారి షాపుల రెన్యువల్కు ప్రయత్నిస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి మందోజి నరేష్, శివరాత్రి శ్రీశైలం, బోగా అజయ్, శ్రీనాథ్, విజయ్, ప్రవీణ్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి