కొండపై ఎస్పీఎఫ్ సిబ్బందికి సీపీఆర్, ఫైర్ ఫైటింగ్ శిక్షణ
కొండపై ఎస్పీఎఫ్ సిబ్బందికి సీపీఆర్, ఫైర్ ఫైటింగ్ శిక్షణ
Editor Desk
యాదగిరిగుట్ట:
స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యమని ఎస్పీఎఫ్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు అన్నారు.
యాదగిరిగుట్టలో టీజీ ఎస్పీఎఫ్ డీజీ స్వాతి లాక్రా ఆదేశాల మేరకు, దేవస్థాన భద్రతా విభాగానికి చెందిన ఎస్పీఎఫ్ సిబ్బందికి బుధవారం కొండపై సీపీఆర్, ఫైర్ ఫైటింగ్ అంశాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన విధానం, సీపీఆర్ పద్ధతులు, ప్రాథమిక చికిత్సపై నిపుణులు సిబ్బందికి అవగాహన కల్పించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎలాంటి ప్రమాదం జరిగినా వెంటనే స్పందించేలా సిబ్బందిని సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం డీఈఓ నవీన్, ఎస్సై రవికుమార్, సిబ్బంది నందు నాయక్, మురళి, కురుమూర్తి, పాండు, శ్రీకాంత్ రెడ్డి, సిద్ధులు, మహేష్, అనిల్, లక్ష్మణ్, దేవస్థానం సిబ్బంది సుధాకర్, బాలరాజు, హోంగార్డ్స్ విజయ్, మమత, వైద్య బృందం, అగ్నిమాపక శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి