ఖర్గే దిష్టిబొమ్మ దహనం
ఖర్గే దిష్టిబొమ్మ దహనం
Editor Desk
భారతీయ జనతా పార్టీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే దిష్టిబొమ్మను బీజేపీ నేతలు దహనం చేశారు. పట్టణ శాఖ అధ్యక్షుడు రత్నపురం బలరామ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాయ దశరథ మాట్లాడుతూ, దేశ ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలు అనుచితమని విమర్శించారు. ఖర్గే వ్యాఖ్యలు బాధాకరమని, దేశ ప్రజలు అంగీకరించరని అన్నారు.
కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు వంగేటి సూచిరిత, జెర్రిపోతుల స్వర్ణలత, తుమ్మల యాస్మిన్, జిల్లా ఉపాధ్యక్షులు జైనపల్లి శ్యామ్ సుందర్ రెడ్డి, పన్నాల చంద్రశేఖర్ రెడ్డి, మండల అధ్యక్షుడు సురేష్ రెడ్డి, నీలం రమేష్, మంగు నర్సింహారావు, ఎం.డి. మహమూద్, మోర్చా అధ్యక్షులు డీఎల్ఎన్ గౌడ్, మాధురి చంద్ర, పట్నం కపిల్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఉడుత భాస్కర్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి