PRINT TIME: April 23, 2026 03:30 PM
కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. హైకోర్టు తీర్పుపై బిఆర్ఎస్ నేతల హర్షం.
కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. హైకోర్టు తీర్పుపై బిఆర్ఎస్ నేతల హర్షం.
April 23, 2026 01:30 PM
23 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కాలేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అమలును నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును బిఆర్ఎస్ నాయకులు స్వాగతించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని పేర్కొన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టును రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అపవాదులకు గురిచేయాలని చేసిన ప్రయత్నాలకు ఈ తీర్పు గట్టి సమాధానమని అన్నారు.
కెసిఆర్ నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు మేలు చేశాయని, వాటిని దెబ్బతీయాలనే కుట్రలు విఫలమయ్యాయని వారు పేర్కొన్నారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నినాదాలు చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి