Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ లో ట్రాఫిక్ సమస్యల నివారణ కు ఆపరేషన్ రోప్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 11:54 AM

కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. హైకోర్టు తీర్పుపై బిఆర్ఎస్ నేతల హర్షం.

కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. హైకోర్టు తీర్పుపై బిఆర్ఎస్ నేతల హర్షం.

కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం.  హైకోర్టు తీర్పుపై బిఆర్ఎస్ నేతల హర్షం.
April 23, 2026 01:30 PM 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కాలేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అమలును నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును బిఆర్ఎస్ నాయకులు స్వాగతించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని పేర్కొన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టును రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అపవాదులకు గురిచేయాలని చేసిన ప్రయత్నాలకు ఈ తీర్పు గట్టి సమాధానమని అన్నారు.

కెసిఆర్ నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు మేలు చేశాయని, వాటిని దెబ్బతీయాలనే కుట్రలు విఫలమయ్యాయని వారు పేర్కొన్నారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నినాదాలు చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News