కౌమార దశ విద్యపై పోస్టర్ పోటీ విద్యార్థుల్లో అవగాహన పెంపు
కౌమార దశ విద్యపై పోస్టర్ పోటీ విద్యార్థుల్లో అవగాహన పెంపు
Editor Desk
రాయగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కౌమార దశ విద్యపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోసం పోస్టర్ తయారీ పోటీ నిర్వహించగా వివిధ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
కౌమార దశ ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, బాధ్యతాయుత ప్రవర్తన, ఆరోగ్యకర జీవనశైలి వంటి అంశాలపై విద్యార్థులు సృజనాత్మక పోస్టర్లు రూపొందించారు. పోటీలో ఎం. తుర్కపల్లి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు మొదటి స్థానం సాధించగా, అడ్డగూడూరు కేజీబీవీ విద్యార్థులు రెండో స్థానం, ఆలేరు పీఎం జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు మూడో స్థానం దక్కించుకున్నారు.
పోటీకి న్యాయనిర్ణేతలుగా కె. సత్యనారాయణ, ఎన్. శేఖర్ వ్యవహరించగా, రిసోర్స్ పర్సన్గా ఎన్. శేఖర్ పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా భువనగిరి ఏరియా ఆసుపత్రి వైద్యుడు డా. వంశీకృష్ణ, ఎయిడ్స్ కార్యక్రమ కౌన్సిలర్ సమన్వయకర్త శ్రీ ముత్తయ్య హాజరయ్యారు.
కార్యక్రమాన్ని ఏఎంఓ జానీ అఫ్గాన్ సమన్వయం చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో కౌమార దశ ఆరోగ్యం, అవగాహన, బాధ్యతాయుత ప్రవర్తనపై చైతన్యం పెంపొందించడంతో పాటు వారి సృజనాత్మకతకు ప్రోత్సాహం లభించిందని నిర్వాహకులు తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి