Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలి. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 04:27 PM

కౌమార దశ విద్యపై పోస్టర్ పోటీ విద్యార్థుల్లో అవగాహన పెంపు

కౌమార దశ విద్యపై పోస్టర్ పోటీ విద్యార్థుల్లో అవగాహన పెంపు

కౌమార దశ విద్యపై పోస్టర్ పోటీ విద్యార్థుల్లో అవగాహన పెంపు
09-03-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాయగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కౌమార దశ విద్యపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోసం పోస్టర్ తయారీ పోటీ నిర్వహించగా వివిధ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

కౌమార దశ ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, బాధ్యతాయుత ప్రవర్తన, ఆరోగ్యకర జీవనశైలి వంటి అంశాలపై విద్యార్థులు సృజనాత్మక పోస్టర్లు రూపొందించారు. పోటీలో ఎం. తుర్కపల్లి జెడ్‌పీహెచ్‌ఎస్ విద్యార్థులు మొదటి స్థానం సాధించగా, అడ్డగూడూరు కేజీబీవీ విద్యార్థులు రెండో స్థానం, ఆలేరు పీఎం జెడ్‌పీహెచ్‌ఎస్ విద్యార్థులు మూడో స్థానం దక్కించుకున్నారు.

పోటీకి న్యాయనిర్ణేతలుగా కె. సత్యనారాయణ, ఎన్. శేఖర్ వ్యవహరించగా, రిసోర్స్ పర్సన్‌గా ఎన్. శేఖర్ పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా భువనగిరి ఏరియా ఆసుపత్రి వైద్యుడు డా. వంశీకృష్ణ, ఎయిడ్స్ కార్యక్రమ కౌన్సిలర్ సమన్వయకర్త శ్రీ ముత్తయ్య హాజరయ్యారు.

కార్యక్రమాన్ని ఏఎంఓ జానీ అఫ్గాన్ సమన్వయం చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో కౌమార దశ ఆరోగ్యం, అవగాహన, బాధ్యతాయుత ప్రవర్తనపై చైతన్యం పెంపొందించడంతో పాటు వారి సృజనాత్మకతకు ప్రోత్సాహం లభించిందని నిర్వాహకులు తెలిపారు.

Sthanikam

కౌమార దశ విద్యపై పోస్టర్ పోటీ విద్యార్థుల్లో అవగాహన పెంపు

Article Image

రాయగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కౌమార దశ విద్యపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోసం పోస్టర్ తయారీ పోటీ నిర్వహించగా వివిధ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

కౌమార దశ ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, బాధ్యతాయుత ప్రవర్తన, ఆరోగ్యకర జీవనశైలి వంటి అంశాలపై విద్యార్థులు సృజనాత్మక పోస్టర్లు రూపొందించారు. పోటీలో ఎం. తుర్కపల్లి జెడ్‌పీహెచ్‌ఎస్ విద్యార్థులు మొదటి స్థానం సాధించగా, అడ్డగూడూరు కేజీబీవీ విద్యార్థులు రెండో స్థానం, ఆలేరు పీఎం జెడ్‌పీహెచ్‌ఎస్ విద్యార్థులు మూడో స్థానం దక్కించుకున్నారు.

పోటీకి న్యాయనిర్ణేతలుగా కె. సత్యనారాయణ, ఎన్. శేఖర్ వ్యవహరించగా, రిసోర్స్ పర్సన్‌గా ఎన్. శేఖర్ పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా భువనగిరి ఏరియా ఆసుపత్రి వైద్యుడు డా. వంశీకృష్ణ, ఎయిడ్స్ కార్యక్రమ కౌన్సిలర్ సమన్వయకర్త శ్రీ ముత్తయ్య హాజరయ్యారు.

కార్యక్రమాన్ని ఏఎంఓ జానీ అఫ్గాన్ సమన్వయం చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో కౌమార దశ ఆరోగ్యం, అవగాహన, బాధ్యతాయుత ప్రవర్తనపై చైతన్యం పెంపొందించడంతో పాటు వారి సృజనాత్మకతకు ప్రోత్సాహం లభించిందని నిర్వాహకులు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News