PRINT TIME: April 11, 2026 12:17 PM
కార్యకర్త కుటుంబానికి అండగా పూస బాలకిషన్ రూ.10 వేలు ఆర్థిక సహాయం అందజేత.
కార్యకర్త కుటుంబానికి అండగా పూస బాలకిషన్ రూ.10 వేలు ఆర్థిక సహాయం అందజేత.
April 11, 2026 11:03 AM
81 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట మండలం లోని ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త శివగల్ల జ్ఞానేశ్వర్ అనారోగ్యంతో మృతి చెందడం తో మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా నాయకుడు పూస బాలకిషన్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రూ.10 వేల నగదు సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో కూడా కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
మాజీ సర్పంచ్, మాజీ ఎంపీపీ పూస బాలానర్సింహా కూడా కుటుంబాన్ని పరామర్శించి తమ మద్దతు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ శాఖ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి