Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పంతంగిలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గ్రామాల్లో శుభ్రత పాటించండి – ప్రజల ఆరోగ్యం ముఖ్యం: ఎంపీడీఓ వెంకటలక్ష్మి కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం రాయికోడ్‌లో వీరభద్రేశ్వర స్వామి జాతర ప్రారంభం జురెల్ జుంఝుమారుతం.. గుజరాత్ కోటలో రాయల్స్ జైత్రయాత్ర! “అడవిని కాపాడే ‘అమ్మ’: జార్ఖండ్ ‘లేడీ టార్జాన్’ చామీ ముర్ము 30 లక్షల చెట్ల గాథ” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” సింగరేణి గనిలో దళిత కార్మికులపై అమానుషిక వివక్ష: వెయిటింగ్ రూమ్‌లో భోజనానికి అడ్డుకున్న అధికారులు! ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 06, 2026 09:32 PM

కార్పొరేట్ విద్యకు సీఎం ప్రోత్సాహం?

కార్పొరేట్ విద్యకు సీఎం ప్రోత్సాహం?

కార్పొరేట్ విద్యకు సీఎం ప్రోత్సాహం?
April 06, 2026 07:32 PM 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,

విద్యను వ్యాపారంగా మార్చి భారీ ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ పాఠశాలలకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తోందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్‌బీనగర్ ఇన్‌చార్జి, రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి బొంగు వెంకటేష్ గౌడ్ విమర్శించారు. ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన ఏవిఎన్ లేక్ ఫీల్డ్ గ్లోబల్ స్కూల్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి హాజరవడం సరికాదన్నారు.

ఎల్కేజీ స్థాయిలోనే లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలను నియంత్రించాల్సిన ప్రభుత్వం, వాటి కార్యక్రమాలకు హాజరుకావడం ద్వారా ప్రజలకు తప్పు సంకేతాలు ఇస్తోందని ఆక్షేపించారు. కొత్త పేర్లతో కార్పొరేట్ విద్యను విస్తరించడాన్ని అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు.

గత ప్రభుత్వాల మాదిరిగానే ప్రస్తుత ప్రభుత్వం కూడా విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News