Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం 10వ తరగతి మెమో పోగొట్టుకున్న యువకుడు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:54 PM

కార్పొరేట్ విద్యకు సీఎం ప్రోత్సాహం?

కార్పొరేట్ విద్యకు సీఎం ప్రోత్సాహం?

కార్పొరేట్ విద్యకు సీఎం ప్రోత్సాహం?
April 06, 2026 07:32 PM 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,

విద్యను వ్యాపారంగా మార్చి భారీ ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ పాఠశాలలకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తోందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్‌బీనగర్ ఇన్‌చార్జి, రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి బొంగు వెంకటేష్ గౌడ్ విమర్శించారు. ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన ఏవిఎన్ లేక్ ఫీల్డ్ గ్లోబల్ స్కూల్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి హాజరవడం సరికాదన్నారు.

ఎల్కేజీ స్థాయిలోనే లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలను నియంత్రించాల్సిన ప్రభుత్వం, వాటి కార్యక్రమాలకు హాజరుకావడం ద్వారా ప్రజలకు తప్పు సంకేతాలు ఇస్తోందని ఆక్షేపించారు. కొత్త పేర్లతో కార్పొరేట్ విద్యను విస్తరించడాన్ని అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు.

గత ప్రభుత్వాల మాదిరిగానే ప్రస్తుత ప్రభుత్వం కూడా విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News