కార్పొరేట్ విద్యకు సీఎం ప్రోత్సాహం?
కార్పొరేట్ విద్యకు సీఎం ప్రోత్సాహం?
Editor Desk
హైదరాబాద్,
విద్యను వ్యాపారంగా మార్చి భారీ ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ పాఠశాలలకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తోందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్బీనగర్ ఇన్చార్జి, రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి బొంగు వెంకటేష్ గౌడ్ విమర్శించారు. ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన ఏవిఎన్ లేక్ ఫీల్డ్ గ్లోబల్ స్కూల్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి హాజరవడం సరికాదన్నారు.
ఎల్కేజీ స్థాయిలోనే లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలను నియంత్రించాల్సిన ప్రభుత్వం, వాటి కార్యక్రమాలకు హాజరుకావడం ద్వారా ప్రజలకు తప్పు సంకేతాలు ఇస్తోందని ఆక్షేపించారు. కొత్త పేర్లతో కార్పొరేట్ విద్యను విస్తరించడాన్ని అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు.
గత ప్రభుత్వాల మాదిరిగానే ప్రస్తుత ప్రభుత్వం కూడా విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి