కొత్త సంవత్సరంలో అయినా ఆరు గ్యారెంటీలను అమలు చేయండి: మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డిబి నాగభూషణం
కొత్త సంవత్సరంలో అయినా ఆరు గ్యారెంటీలను అమలు చేయండి: మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డిబి నాగభూషణం
Sandeep journalist
డిసెంబర్ నెల లాస్ట్ వచ్చిన కూడా యాసంగి పంటకు రైతుబంధు వేయలేని అసమర్ధత ప్రభుత్వం.
అధికారం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న కూడా రైతులను వేధిస్తున్న రేవంత్ రెడ్డి.
అందోల్, స్థానికం ప్రతినిధి:
రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న కూడా ఇంతవరకు రైతుబంధు వేయకుండా కనీసం యూరియా బస్తాలు ఇవ్వకుండా, రైతులను ఎన్ని రోజులని గోసపెడతారు అని అన్నారు అందోల్-జోగిపేట మాజీ మార్కెట్ చైర్మన్ డి బి నాగభూషణం. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా రైతులపై ప్రేమ ఉంటే జనవరి ఫస్ట్ కు రైతుబంధు వేయాలి అన్నారు. రైతులు ఈ యాసంగి పంటలో, వరి నాట్లు వేసుకుంటారు కాబట్టి యూరియా బస్తాలు సప్లై చేయాలి అని, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కెసిఆర్ గారిని టార్గెట్ చేసుకొని తిట్టడం తప్ప రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదని, అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆరు గ్యారెంటీల గురించి మరియు 420 హామీల గురించి అడుగుతే, పండ పెట్టి తొక్కుతా, పేగు మెడల వేసుకుని ఊరేగుతా! లాగులొ తొండలు విడుస్తా!! అనే మాటలు మరిచిపోయి, ఇప్పటికైనా నూతన సంవత్సరంలో, ఆరు గ్యారెంటీలు 420 హామీ లు, అమలు చేసే దిశగా మీకార్యచరణ ఉండాలని, భారత రాష్ట్ర సమితి తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి