Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
14 ఏళ్ల సెంటిమెంట్‌ బద్దలు.. కేకేఆర్‌పై ముంబై రికార్డ్ విక్టరీ.. చెలరేగిన రోహిత్, రికెల్టన్! కాటమయ్య గుడి వద్ద తాగునీటి సమస్యకు పరిష్కారం:శివరాజ్ గౌడ్ హామీ ప్రభుత్వ ఉద్యోగుల సేవలు, వసతి సౌకర్యాలపై బాబాసాహెబ్ అంబేడ్కర్ స్పష్టత: నాగ భీమ్ డైరీ (29 మార్చి 1945). తెలంగాణలో ఉరుములు–మెరుపులతో కురిసే భారీ వర్షాలు: డప్పూర్‌లో ఉర్సు మహోత్సవం ఘనంగా అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 30, 2026 07:00 AM

కామవరపుకోటలో అంగరంగ వైభవంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం

కామవరపుకోటలో అంగరంగ వైభవంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం

కామవరపుకోటలో అంగరంగ వైభవంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం
March 30, 2026 05:03 AM 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా కామవరపుకోట మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 44వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మండల టీడీపీ అధ్యక్షుడు కిలారు సత్యనారాయణ ఆధ్వర్యంలో కొత్తూరు రహదారి బంగ్లా వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.

తొలుత పాతూరు నుండి భారీ ర్యాలీగా టీడీపీ అభిమానులు ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆపై పార్టీ జెండాను ఎగరవేసి, కేక్ కట్ చేసి శ్రేణులు పరస్పరం స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా రేపటితో పదవీకాలం పూర్తవుతున్న నేపథ్యంలో, తెలుగుదేశం మద్దతుతో వైసీపీ హయాంలో గెలుపొందిన ఐదుగురు సర్పంచులు, ఒక ఎంపీటీసీతో పాటు 1982 నుంచి పార్టీలో సేవలందిస్తున్న సీనియర్లను దుశ్శాలువాలతో, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. మండల అధ్యక్షుడు కిలారు సత్యనారాయణ వారికి మెమెంటోలు అందజేశారు.

ముఖ్య అతిథిగా హాజరైన ఘంటా మురళి మాట్లాడుతూ, ఎన్టీఆర్ ఒక ట్రెండ్ సెట్టర్ అని, తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పార్టీని స్థాపించి 44 సంవత్సరాలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. భూమి, ఆకాశం ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ విరాజిల్లుతుందని, ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు.

మండల టీడీపీ అధ్యక్షుడు కిలారు సత్యనారాయణ మాట్లాడుతూ, ఎన్టీఆర్ అనేక సంస్కరణలకు ఆద్యుడని, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. ఆయన చూపిన బాటలో సంక్షేమానికి అభివృద్ధిని జోడించి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. అలాగే వారి మార్గదర్శకత్వంలో రోషన్ కుమార్, పుట్ట మహేష్ కుమార్ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు.

కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు కిలారు సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు జుజ్జురి బాబ్జి, సర్పంచులు గోరింక దాసు, గూడపాటి కేశవరావు, పసుమర్తి పార్థసారధి బాబు, వేముల నాగేశ్వరరావు, గూడపాటి మధు, కరిపోతు అనూష, ఎంపీటీసీ కంఠమనేని అంజిమూర్తి, సొసైటీ చైర్మన్లు తూతా బాలాజీ కుమార్, ఘంటా మాధవరావు, బొప్పన అంజయ్య, డోలా విజయ్, పొన్నుబోయిన సురేష్, కారె సాల్మన్ రాజు, మాన్యం దుర్గారావు, గ్రామ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News