Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:14 PM

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం: బీఆర్‌ఎస్

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం: బీఆర్‌ఎస్

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం: బీఆర్‌ఎస్
23-04-2026 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని బీఆర్‌ఎస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. నల్లగొండలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వారు మాట్లాడారు.

హైకోర్టు తీర్పు కాంగ్రెస్, బీజేపీ నేతలకు చెంపపెట్టు లాంటిదని జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్ వ్యాఖ్యానించారు. పీసీ ఘోష్ కమిషన్‌ను రాజకీయ దురుద్దేశంతోనే ఏర్పాటు చేశారని విమర్శించారు. కాళేశ్వరం కూలిపోయిందన్న ప్రచారం పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు.

మెడిగడ్డ మరమ్మతులను కావాలనే అడ్డుకున్నారని ప్రభుత్వంపై ఆరోపిస్తూ, సీఎం, మంత్రివర్గం ఏపీ ప్రయోజనాల కోసం పనిచేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో డిండి లిఫ్ట్‌కు నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హామీలను విస్మరించి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. రైతులకు పంట కొనుగోళ్లు లేవు, యూరియా కొరత, విద్యుత్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఆరోపించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను రేపటి నుంచి సందర్శిస్తామని, అవసరమైతే కలెక్టరేట్ ముట్టడి ఉద్యమానికి సిద్ధమని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, బండ నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భగత్ కుమార్, కార్పొరేటర్లు, పార్టీ నేతలు పాల్గొన్నారు

Sthanikam

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం: బీఆర్‌ఎస్

Article Image

నల్లగొండ

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని బీఆర్‌ఎస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. నల్లగొండలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వారు మాట్లాడారు.

హైకోర్టు తీర్పు కాంగ్రెస్, బీజేపీ నేతలకు చెంపపెట్టు లాంటిదని జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్ వ్యాఖ్యానించారు. పీసీ ఘోష్ కమిషన్‌ను రాజకీయ దురుద్దేశంతోనే ఏర్పాటు చేశారని విమర్శించారు. కాళేశ్వరం కూలిపోయిందన్న ప్రచారం పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు.

మెడిగడ్డ మరమ్మతులను కావాలనే అడ్డుకున్నారని ప్రభుత్వంపై ఆరోపిస్తూ, సీఎం, మంత్రివర్గం ఏపీ ప్రయోజనాల కోసం పనిచేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో డిండి లిఫ్ట్‌కు నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హామీలను విస్మరించి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. రైతులకు పంట కొనుగోళ్లు లేవు, యూరియా కొరత, విద్యుత్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఆరోపించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను రేపటి నుంచి సందర్శిస్తామని, అవసరమైతే కలెక్టరేట్ ముట్టడి ఉద్యమానికి సిద్ధమని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, బండ నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భగత్ కుమార్, కార్పొరేటర్లు, పార్టీ నేతలు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News